రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఓ వైపు సినిమాలు.. మరోవైపు హాట్ ఫోటోషూట్లతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది ఈ భామ. ఇదిలా ఉంటే.. రకుల్ అక్కినేని వారి కోడలు సమంతకు అభిమానిగా మారిపోయిందట. రకుల్ మాత్రమే కాదు ఆమె ఫ్యామిలీ మొత్తం సమంత ఫ్యాన్స్గా మారిపోయారట. ఈ విషయాన్ని రకుల్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఫ్యామిలీమ్యాన్-2తో తొలిసారిగా వెబ్ సిరీస్లోకి అరంగేట్రం చేసిన సమంత. ఈ వెబ్ సిరీస్లో సమంత రాజీ పాత్రలో పూర్తిగా పరాకాయ ప్రవేశం చేసి నటించింది. అలాగే యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీసిందనే చెప్పాలి. సాధారణ జనాలతో పాటు సెలబ్రిటీలు కూడా సామ్ నటనకు ఫిదా అయ్యారు.
ఇక తాజాగా ఈ వెబ్ సిరీస్ను చూసిన రకుల్.. ఫ్యామిలీ మ్యాన్ 2 చూశాను. అందరూ బీభత్సంగా నటించారు. మనోజ్ బాజ్పాయ్ అద్భుత నటన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవడం లేదు. ఇక సమంత.. నీ యాక్టింగ్కు హ్యాట్సాఫ్. రాజీ పాత్రలో జీవించేశావు. ఈ సిరీస్ చూశాక నాతో సహా మా ఫ్యామిలీ అంతా నీకు అభిమానులుగా మారిపోయారు. మీ టీమ్కు శుభాభినందనలు` అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఆమె ట్వీట్ వైరల్గా మారింది.
https://twitter.com/Rakulpreet/status/1402129229035163648?s=20