నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కుతున్న తాజా చిత్రం అఖండ. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా, సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్గా నటిస్తున్నారు.
అలాగే ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇండ్రస్టింగ్ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో రత్తాలు.. పాటతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన రాయ్ లక్ష్మీ ఇప్పుడు బాలయ్యతో చిందులేయబోతోందట.
అఖండ సినిమా కోసం తమన్ ఒక మసాలా సాంగ్ ను అందించాడట. ఈ పాట కోసం రాయ్ లక్ష్మిని తీసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. అంతేకాదు, తదుపరి షెడ్యూల్లో బాలకృష్ణ – రాయ్ లక్ష్మిలపై ఆ స్పెషల్ షాంగ్ చిత్రికరించనున్నారని తెలుస్తోంది.