గోవాకు `పుష్ప‌` టీమ్‌..నెల రోజులు అక్క‌డేన‌ట‌?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం పుష్ప‌. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించబోతున్నారు. ఆయన సరసన రష్మిక మందన్నా
నటిస్తోంది.

అయితే క‌రోనా సెకెండ్ వేవ్ కార‌ణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్‌.. త్వ‌ర‌లోనే రీ స్టార్ట్ కానుంది. ఈ నేప‌థ్యంలో పుష్ప టీమ్ గోవాకు ప‌య‌నం కానున్న‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ద్వారా తెలుస్తోంది. గోవాలోని ప‌లు లొకేష‌న్ల‌లో సుమారు నెల రోజుల పాటు కీల‌క స‌న్నివేశాల‌ను షూట్ చేయ‌నున్నార‌ట‌.

జూలై మొద‌టి వారం నుంచి పుష్ప‌రాజ్ టీం షూట్ లో పాల్గొన‌బోతోంద‌ని.. ఈ షెడ్యూల్ లో పుష్ప‌రాజ్ పై ఓ సాంగ్‌ను కూడా షూట్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. కాగా, ఇప్ప‌టికే 75 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకున్న పుష్ప‌.. ద‌స‌రాకు విడుద‌ల‌య్యే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి.