త్వరలోనే ఎన్టీఆర్ పొలిటికల్ లీడర్గా మారబోతున్నాడట. అయితే ఇది రియల్ లైఫ్లో కాదండోయ్.. రీల్ లైఫ్లోనే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్ట్ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ప్రకటించాడు.
ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. ఇక కొరటాలతో సినిమా పూర్తి అయిన వెంటనే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో ఓ చిత్రం చేయనున్నాడు ఎన్టీఆర్. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ను ఓ పొలిటికల్ లీడర్గా ప్రశాంత్ చూపించనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది.
మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది. కాగా, వీరి కాంబోలో తెరకెక్కబోయే చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్న సంగతి తెలిసిందే.