సౌత్లో వరుస సినిమాలు చేస్తూ.. లేడీ సూపర్ స్టార్గా ఎదిగిన నయనతార ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ సిద్ధం కాబోతోంది. అది కూడా ఓ స్టార్ హీరో మూవీతోనట. పూర్తి వివరాల్లోకి వెళ్తే..బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే.
సంకి టైటిల్తో మూవీ తెరకెక్కనుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం అట్లీ.. సినిమాలో ఇతర ప్రధాన తారాగణం ఎంపికపై ఫోకస్ పెట్టారని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే షారుఖ్ ఖాన్కు జోడీగా నయనతారను ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ మధ్యే అట్లీ నయన్ను సంప్రదించగా.. ఆమె కూడా షారుఖ్ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఇదే నిజమైతే.. నయన్ తొలి బాలీవుడ్ చిత్రం ఇదే అవుతుంది.