ఇండస్ట్రీలో క్లాస్ హీరోగా నాగచైతన్య మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన విక్రమ్ కుమార్ డైరెక్షన్లో థాంక్యూ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇందులో రాశీఖన్నా హీరోయిన్. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన బిగ్ షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు మూవీ టీం. రొమాంటిక్ డ్రామా కమ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ పనులు చివరి దశకు వచ్చాయి.
ఇక దీని తర్వాత చైతు బాలీవుడ్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అద్వైత్ చందన్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ కు రీమేక్ గా చేస్తున్నారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం చైతూ ఓకే చెప్పాడని తెలుస్తోంది. బుబ్బా అనే పాత్ర చైతూ కొత్త స్టంట్స్ చేయబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో చైతూ ఆర్మీ ఆఫీసర్ గా మెస్మరైజ్ చేయబోతున్నాడు. ఆర్మీ మ్యాన్ గా కనిపించేందుకు చైతూ లుక్ మార్చుకునేందుకు ట్రై చేస్తున్నాడు.