అయ్యాయో: భర్తకు అన్ని తానై అంతిమ సంస్కారాలు చేసిన భార్య..!

ఏపీలో దారుణం చోటుచేసుకుంది. భర్తకు భార్య తలకొరివి పెట్టాల్సి వచ్చింది. మాచవరంలో ప్రసాద్, నాగమణి దంపతులు నివసిస్తున్నారు. 15 రోజుల కిందట అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స ఫలించక నిన్న చనిపోయాడు. దంపతులకు మగ పిల్లలు లేకపోవడం, తండ్రి రిటైర్డు టీచర్ ఉన్నా వేరే చోట నివసిస్తుండడంతో కొడుకు అంత్యక్రియలకు, తలకొరివి పెట్టేందుకు రమ్మని సమాచారం ఇచ్చారు. అంత్యక్రియలకు కాదు కదా, వచ్చి చూసేందుకే తండ్రి అంగీకరించలేదు.

ఆర్ధికంగా సర్వస్వం భర్త ట్రీట్మెంట్ కే ఖర్చు పెట్టుకున్న నాగమణి అంత్యక్రియలకు డబ్బులు లేక ఇబ్బందిపడుతుండడంతో మంత్రి ఆళ్లనాని సహాయం పంపించారు. అయితే హిందూ ధర్మం ప్రకారం తల కొరివి పెట్టేందుకు ఇష్టపడని అతని తండ్రి వాళ్లు వీళ్లు నచ్చచెప్పడంతో తన కొడుకు ప్రసాద్ చివరి చూపుల కోసం వచ్చి దూరం నుంచే చూసి వెళ్లిపోయాడు. దీంతో చేసేదేమీలేక నాగమణి స్వయంగా తన భర్తకు తలకొరివి పెట్టి కడసారి అంతిమ సంస్కారాలు పూర్తి చేసింది.