ఉప్పెన సినిమాతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో రెండో చిత్రాన్ని కూడా పూర్తి చేశాడు. ఈ చిత్రానికి కొండపొలం అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇక మూడో చిత్రాన్ని గిరీశయ్య దర్శతంలో చేస్తున్నాడు.
శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. కేతికా శర్మ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం తర్వాత వైష్ణవ్ అన్నపూర్ణ స్టూడియోస్పై హీరో నాగార్జున నిర్మాతగా ఓ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రం ద్వారా పృథ్వీ అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు.
అయితే ఈ సినిమాలో వైష్ణవ్ పాత్రకు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో వైష్ణవ్ హాకీ ప్లేయర్ గా కనిపిస్తాడట. స్పోర్ట్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కబోయే ఈ చిత్రంలో అసలు సిసలైన హాకీ ప్లేయర్గా ఒదిగిపోవడానికి వైష్ణవ్ ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టారని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.