కరోనా సెకెండ్ వైవ్ ఎంత ఉధృతంగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మహమ్మారి ధాటికి ప్రతి రోజు వేలాది మంది మృత్యువాత పడుతుండగా.. లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇక తాజాగా వివాస్పద దర్శకుడు రామ్ గోపల్ ఇంట్లో కరోనా తీవ్ర విషాదాన్ని నింపింది.
రామ్ గోపాల్వర్మకు వరుసకు సోదరుడైన పి. సోమశేఖర్ ఆదివారం కరోనాతో మరణించారు. నిర్మాత, దర్శకుడు అయిన పి. సోమ్ శేఖర్ తన తల్లికి కరోనా సోకడంతో ఆమెను జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు. దాని వల్ల ఆయన కూడా కరోనా బారిన పడ్డారు. ఆయన చికిత్స తీసుకుంటూనే హైద్రాబాద్లో కన్నుమూశారు.
కాగా, సోమశేఖర్ బాలీవుడ్లో పలు సినిమాలకు పనిచేశారు. రంగీలా, దౌడ్, సత్య, జంగిల్, కంపెనీ వంటి సినిమాలకు ప్రొడక్షన్ బాధ్యతలు నిర్వర్తించారు. ముస్కురాకే దేఖ్ జరా అనే బాలీవుడ్ మూవీకి దర్శకుడిగా పనిచేశారు. ఇక ఈయన మృతిపై బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్తో సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.