టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారు పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలె ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లింది.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రం తర్వాత మహేష్ తన తదుపరి చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఉంటుందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాపై అప్డేట్ ఈ రోజే రాబోతుందని టాలీవుడ్ సర్కిల్స్లో బలంగా టాక్ నడుస్తోంది.
దాంతో మహేష్ అభిమానులు ఫుల్ ఎగ్జైట్గా ఎదురు చూస్తున్నారు. కాగా, ఇప్పటికే వీరి కాంబోలో అతడు, ఖలేజా చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రాలు థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా.. మహేష్, త్రివిక్రమ్ కాంబోకి మాత్రం మంచి క్రేజ్ ఏర్పడింది. అందుకే వీరి మూడో చిత్రంపై హైప్ క్రియేట్ అయింది.