రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్లో సలార్ ఒకటి. కోలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. కరోనా సెకెండ్ వేవ్ కారణంగా బ్రేక్ తీసుకుంది.
హోంబలే ఫిలింస్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ను పాన్ ఇండియా స్టాయిలో నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో విలన్గా బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం నటిస్తున్నాడట.
ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తి అయ్యాయని టాక్. అయితే ఈయనది గెస్ట్ రోల్ లాంటి క్యారెక్టర్ అని, కాకపోతే విలన్స్ ను లీడ్ చేసే మెయిన్ విలన్ క్యారెక్టర్ అని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాల్సి ఉంది.