లాంగ్ గ్యాప్ తర్వాత వకీల్ సాబ్తో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, మలయాళంలో హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం తెలుగు రీమేక్ చేస్తున్నాడు. వీటి తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు.
ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ పూర్తిగా కమర్షియల్ అంశాలతో రాసుకున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ లెక్చరర్గా కనిపించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం వచ్చే నెల నంచి సెట్స్ మీదకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
అయితే సినిమాలో కాలేజ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో.. కళాదర్శకుడు ఆనంద్సాయి ఎంతో ప్రత్యేకంగా కాలేజీ సెట్ను నిర్మించారట. మేజర్ షెడ్యూల్ షూటింగ్ ఈ సెట్ లోనే జరుగుతుందని అంటున్నారు. అంటే వచ్చే నెలలో లెక్చరర్గా పవన్ రంగంలోకి దిగబోతున్నాడన్నమాట.