లెక్చరర్‌గా రంగంలోకి దిగ‌బోతున్న‌ పవన్‌ కల్యాణ్‌?!

లాంగ్ గ్యాప్ త‌ర్వాత వ‌కీల్ సాబ్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హరిహర వీరమల్లు, మలయాళంలో హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం తెలుగు రీమేక్ చేస్తున్నాడు. వీటి త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు.

ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ పూర్తిగా కమర్షియల్ అంశాలతో రాసుకున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో ప‌వ‌న్ లెక్చ‌ర‌ర్‌గా క‌నిపించ‌బోతున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రం వ‌చ్చే నెల నంచి సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తోంది.

అయితే సినిమాలో కాలేజ్‌ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో.. కళాదర్శకుడు ఆనంద్‌సాయి ఎంతో ప్ర‌త్యేకంగా కాలేజీ సెట్‌ను నిర్మించార‌ట‌. మేజర్ షెడ్యూల్ షూటింగ్‌ ఈ సెట్ లోనే జరుగుతుందని అంటున్నారు. అంటే వ‌చ్చే నెల‌లో లెక్చ‌ర‌ర్‌గా ప‌వ‌న్ రంగంలోకి దిగ‌బోతున్నాడ‌న్న‌మాట‌.