చిరుకి ఊహించ‌ని షాకిచ్చిన ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌..ఏం జ‌రిగిందంటే?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. ఇక ఇది పూర్తి కాగానే చిరు మ‌ల‌యాళంలో హిట్ అయిన‌ లూసిఫ‌ర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌బోతున్నాడు.

శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ రీమేక్ చిత్రాన్ని తెర‌కెక్కించే బాధ్య‌త‌ను చిరు ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌ మోహన్ రాజా చేతుల్లో పెట్టారు. అయితే ఇప్పుడు ఈ చిత్రం నుంచి మోహ‌న్ రాజా తప్పుకుని చిరుకు ఊహించ‌ని షాక్ ఇచ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

నిజానికి ఈ సినిమా ద‌ర్శ‌కుడి విష‌యంలో మొద‌టి నుంచి గంద‌ర‌గోళం నెల‌కొంది. ఫ‌స్ట్ ఈ సినిమా కోసం సుజీత్ ప‌ని చేశారు. ఏవో కార‌ణాల వ‌ల్ల ఆయ‌న త‌ప్పుకోవ‌డంతో.. వివి. వినాయ‌క్‌, త్రివిక్ర‌మ్ ఇలా ప‌లువురి ద‌ర్శ‌కుల పేర్ల తెర‌పైకి వ‌చ్చాయి. కానీ, చివ‌ర‌కు ఈ ప్రాజెక్ట్ మోహ‌న్ రాజా వ‌ద్ద‌కు వెళ్లింది. అయితే కార‌ణాలు తెలియ‌వు గానీ, ఇప్పుడు ఆయ‌న కూడా త‌ప్పుకున్న‌ట్టు టాక్ న‌డుస్తోంది.