ముఖ జర్నలిస్ట్, యూట్యూబ్ యాంకర్, నటుడు టీఎన్ఆర్(తుమ్మల నరసింహా రెడ్డి) కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం వార్త సినీ ప్రముఖులను, జర్నలిస్ట్లను తీవ్రంగా కల్చివేసింది. ఈ క్రమంలోనే టీఎన్ఆర్ కుటుంబానికి పలువురు ప్రముఖులు ఆర్థిక సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు.
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి రూ.లక్ష, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు రూ.50 వేలు టీఎన్ఆర్ కుటుంబానికి అందించారు. తాజాగా ప్రముఖ దర్శకుడు మారుతి కూడా రూ. 50 వేల రూపాయలను టీఎన్ఆర్ భార్య జ్యోతి గారి బ్యాంకు ఖాతాకు పంపి మంచి మనసు చాటుకున్నారు. అంతేకాదు, ఈ సమయంలో ప్రతి ఒకరు తమకు తోచినంత సాయం వారికి చెయ్యాలని మారితి సూచించాడు.
https://twitter.com/DirectorMaruthi/status/1392679854777110529?s=20