ఏపీలో 13 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు..కొత్త‌గా ఎన్నంటే?

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు.

ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న స్వ‌ల్పంగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,986 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు 13,02,589 కి చేరింది. అలాగే గత 24 గంటల్లో 84 మంది మృత్యువాత ప‌డ్డారు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో మృతుల సంఖ్య 8,791 ద‌గ్గ‌ర నిలిచింది. అలాగే నిన్నొక్క రోజే 16,167 మంది క‌రోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 11,04,431 కి చేరుకుంది. ప్ర‌స్తుతం ఏపీలో 1,89,367 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక నిన్న ఒక్క రోజే 60,124 క‌రోనా టెస్ట్‌లు నిర్వ‌హించారు అధికారులు.