రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం.. ఇలా వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు.
ఇక ఇప్పుడు ఈయన కోసం టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి పాన్ ఇండియా లెవల్లో ఓ కథ రాస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. పూర్తి స్థాయిలో కథ సిద్దం చేసి ప్రభాస్ను నెరేట్ చేస్తాడట. కథ గనక ప్రభాస్కు నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఆయన కమిటైన సినిమాల తర్వాత చంద్ర యేలేటి ప్రాజెక్ట్ ఉంటుందట.
కాగా, డిఫరెంట్ కథతో, గ్రిప్పింగ్ స్క్రీన్ప్లేతో సినిమాలు తెరకెక్కించడంలో చంద్రశేఖర్ మహాదిట్ట. ఇటీవలె ఈయన నితిన్ హీరోగా చెక్ సినిమాను తెరకెక్కించి ప్రేక్షకులను పలకరించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా.. చంద్రశేఖర్కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.