హీరో సిద్ధార్థ నీ పట్టిచుకోవద్దు : బీజేపీ నేతలు

కేంద్ర ప్రభుత్వం పై నటుడు, హీరో సిద్ధార్థ్‌ చేసే ఆరోపణలను,విమర్శలను అసలు ఎవ్వరూ పట్టించుకోవద్దని భాజపా పార్టీ నేతలు అంటున్నారు. తమిళనాడు భాజపా నేతలు తన ఫోన్‌ నంబర్‌ని అందరికి తెలిసేలా చేశారని,దాని వల్ల తనకి ఎంతోమంది నుండి బెదిరింపు ఫోన్ కాల్స్ ఎక్కువ అవుతున్నాయని హీరో సిద్ధార్థ్‌ ఇటీవల ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో హీరో ఆరోపణలను తాజాగా కొందరు భాజపా నేతలు కొందరు ఖండిస్తూ, హీరో సిద్ధార్థ్‌ ఎన్నోసార్లు భాజపా ప్రభుత్వం పై ఇలాంటి పలు విమర్శలు పుట్టిస్తున్నారని మండిపడ్డారు.

భాజపా ఐటీ సెల్‌ విభాగాధిపతి అయిన నిర్మల్‌ కుమార్‌ స్పందిస్తూ, ప్రస్తుతం ఉన్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు కావాల్సిన ఆహారాన్ని, మందులను పంపిణీ చేసే పనిలో మేము ఉన్నాం. భాజపా మద్దతుదారులందరికీ చెప్పేది ఏమిటంటే, హీరో సిద్ధార్థ్‌తో పాటు ఆయన లాగా విమర్శలు చేసే వ్యక్తుల గురించి ఎవరు పెద్దగా పట్టించుకోకండి. వాళ్లు కేవలం ఇలాంటి ఆరోపణలు చేస్తూ సమయం వృధా చేస్తున్నారని, కానీ అందరు ప్రజలకు సాయం చేయడం పైనే దృష్టి ఉంచండి అంటూ ట్వీట్‌ చేశారు.