మంత్రి ఈటలకు అండగా కోదండరాం..?

తెలంగాణా మంత్రి ఈటెల రాజేంద్ర విషయంలో ఇప్పుడు అధికారులు విచారణ జరుపుతున్న విషయం మనకు తెలిసిందే. భూ కబ్జాలకు సంబంధించిన అప్డేట్ మరో మూడు గంటలో ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. అక్కడ బాధితులకు అన్యాయం జరిగిందని కలెక్టర్ అన్నారు. ఇది ఇలా ఉంటే మంత్రి ఈటెలకు ప్రొఫెసర్ కోదండ రామ్ మద్దతు ఇస్తున్నారు. కేవలం మంత్రి ఈటెల గట్డిగా మాట్లాడినందుకే తన పై విచారణ జరిపిస్తున్నారు అంటూ కెసిఆర్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు కోదండ రామ్.

కేసీఆర్ భూ వివాదాలను కేవలం తన ప్రత్యర్థులను లోబర్చుకోటానికే వినియోగిస్తున్నారని కోదండ రామ్ ఆరోపించారు. రాజకీయ అవసరాల కోసమే కేసీఆర్ ఆయన పై విచారణలు వేస్తున్నాడు అని కోదండ రామ్ అన్నారు. హఫీజ్ పేట్, మియాపూర్ భూవివాదాల కేసుల పై వెంటనే విచారణ జరపాలని కోదండ రామ్ కోరారు. భూ రికార్డుల విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది అని, భూ రికార్డుల సమస్యల పై మా వాదనే సరైనదని కోదండ రామ్ చెప్పుకొచ్చారు