`పుష్ప‌`లో పెరుగుతున్న రంగ‌మ్మత్త రోల్‌..కార‌ణం అదేన‌ట‌?

ద‌ర్శకుడు సుకుమార్ తెర‌కెక్కించిన రంగ‌స్థ‌లం చిత్రంలో రంగ‌మ్మ‌త్త పాత్ర‌లో బుల్లితెర హాట్ యాంక‌ర్ అన‌సూయ అద‌ర‌గొట్టింది. ఈ క్ర‌మంలోనే అన‌సూయ‌కు మ‌రో బంప‌ర్ ఛాన్స్ ఇచ్చాడు సుక్కు. ప్ర‌స్తుతం ఈయ‌న అల్లు అర్జున్ హీరోగా పుష్ప చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు.

ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే అన‌సూయ‌కు కూడా ఈ చిత్రంలో మంచి కీ రోల్ ఇచ్చాడు సుకుమార్. అయితే ప్ర‌స్తుతం పుష్ప రెండు భాగాలుగా రాబోతోంది. ఆ విషయాన్ని ఇటీవ‌లె నిర్మాతలు స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలోనే అనసూయ పాత్ర నిడివిని పెంచుతున్నట్టుగా తెలుస్తోంది. రంగ‌మ్మ‌త్త‌గా అన‌సూయ‌ న‌ట‌నా విశ్వ‌రూపాన్ని చూసిన సుకుమార్‌.. ఆమెను మొదటి భాగంలోనూ, రెండవ భాగంలోనూ న‌టింప‌జేయ‌నున్నారని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇదే నిజ‌మైతే అన‌సూయ‌కు ల‌క్కీ ఛాన్స్ ద‌క్కిన‌ట్టే అవుతుంది.