క‌రోనా బారిన ప‌డ్డ పూజా హెగ్డే..ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌!

క‌రోనా వైర‌స్ ఎవ‌ర్నీ వ‌దిలి పెట్ట‌డం లేదు. అతి సూక్ష్మ‌జీవి అయిన ఈ మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్‌, బాలీవుడ్ ఇండ‌స్ట్రీల్లో క‌రోనా నిండి పోయింది. ఇప్ప‌టికే హీరోలు, హీరోయిన్లు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు ఇలా ఎంద‌రో క‌రోనా బారిన ప‌డ్డారు.

తాజాగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు కూడా క‌రోనా సోకింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగానే ఆమెనే సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాన‌ని..గ‌త కొన్ని రోజులుగా తనతో ఉన్న వాళ్లంద‌రూ క‌రోనా టెస్టు చేయించుకోమని కోరింది పూజా.

అలాగే అభిమానులు త‌న‌పై చూపిస్తున్న ప్రేమ, నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపింది. ఇక పూజాకు క‌రోనా సోక‌డంతో.. ఆమె అభిమానులు ఆందోళ‌న ప‌డుతున్నారు. కాగా, పూజా హెగ్డే ప్ర‌స్తుతం రాధేశ్యామ్‌, ఆచార్య‌, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాల్లో నటిస్తుంది. అలాగే బాలీవుడ్ లో, కోలీవుడ్‌లో కూడా ప‌లు ప్రాజెక్ట్‌తో బిజీగా ఉంది ఈ బ్యూటీ.