సినీ నటుడు, జనసేన పార్టీ నేత, మెగా బ్రదర్ నాగబాబు.. గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పటికే కూతురు నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిపించిన నాగబాబు.. త్వరలోనే కొడుకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి కూడా చేసేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి వరున్ తేజ్ పెళ్లి విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
తాజాగా మరోసారి వరుణ్ వివాహం విషయం తెరపైకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉండే నాగబాబు తాజాగా మరోసారి ఇన్స్ట్రాగ్రామ్ లైవ్లోకి వచ్చి అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ `వరుణ్ అన్నా సాయి పల్లవికి మ్యారేజ్ చేస్తా సార్.. జోడీ బాగుంటుంది` అని కామెంట్ పెట్టాడు.
అయితే సదరు నెటిజన్ కామెంట్కు నాగబాబు షాక్ అయిపోయారు. ఏం చేయాలో పాలుపోని నాగబాబు.. జాతి రత్నాలు సినిమాలో బ్రహ్మానందం జడ్జి స్థానంలో కూర్చున్న ఫోటోను ఎమోజీగా పెట్టారు. మీకు మీరే తీర్పు చెప్పుకోండి నేను జడ్జి ప్లేస్ నుంచి వెళ్లిపోతానంటూ ఎక్స్ప్రెషన్ వచ్చే ఫోటో పెట్టాడు. నాగబాబు ఫన్నీ రిప్లై ఇప్పుడు సోషల్ మీడిమాలో వైరల్ అయింది.