మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు రోజురోజుకు ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. ముఖ్యంగా ట్విట్టర్లో చిరుకు 9 లక్షలకు పైగా మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ, ఆయన మాత్రం ఒకే ఒక్కరిని ఫాలో అయ్యారు. ఆయనే సినీ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి.
గత రెండు రోజులగా ఈ విషయం హాట్ టాపిక్గా కూడా మారింది. దీనిపై రామజోగయ్య శాస్త్రి కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.. తాజాగా చిరు రామజోగయ్య శాస్త్రిను అన్ ఫాల్ అయ్యారు. దీంతో చిరు ఫాలో అయ్యే వారి జాబితా ఒకటి నుంచి జీరోకు చేరుకుంది.
దీంతో ప్రస్తుతం మెగా అభిమానులతో పాటు నెటిజన్లు సైతం ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలోనే చిరు ఎందుకిలా చేశారు..? కావాలనే ఆయన రామజోగయ్య శాస్త్రిని అన్ఫాలో అయ్యారా..? ఇలా అనేక ప్రశ్నలు వ్యక్తం అవుతున్నారు. మరి దీనిపై చిరు స్పందించే వరకు అసలు విషయం బటయకు రాదనే చెప్పాలి.