మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో `అఖండ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలోద్వారక క్రియేషన్స్ పతాకంపై యంగ్ ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. ఈ చిత్రాన్ని మే28న విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా తర్వాత బోయపాటి ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడన్న ప్రశ్న అందరిలోనూ మొదలైంది. ఇప్పటికే అక్కినేని అఖిల్, రామ్, అల్లు అర్జున్ ఇలా పలువురు హీరోల పేర్లు వినిచినప్పటికీ.. అవి పుకార్లే అని తేలిపోయాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం.. నందమూరి కళ్యాణ్ రామ్ తో బోయపాటి తన తదుపరి చిత్రం చేయనున్నాడట. ఇప్పటికే కళ్యాణ్ రామ్కు బోయపాటి ఓ కథను వినిపించారట. అది బాగా నచ్చడంలో వెంటనే ఆయన సినిమా చేసేందుకు ఓకే చెప్పేశారని ప్రచారం జరుగుతోంది. మరి ఇదే నిజమైతే.. బాబాయ్ తర్వాత అబ్బాయినే బోయపాటి సెలెక్ట్ చేసుకున్నట్టు అవుతుంది.