ఒక భాషలో హిట్ అయిన చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేయడం ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయింది. స్టార్ హీరోలు సైతం రీమేక్ చిత్రాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే తెలుగులో ఎన్నో చిత్రాలు రీమేక్ అవుతుండగా.. తమిళ్లో ఇటీవల విడుదల ధనుష్ కర్ణన్ చిత్రం కూడా తెలుగులోకి రీమేక్ కానుంది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ రీమేక్ చిత్రంలో నటించనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే కర్ణన్ రీమేక్ రైట్స్ను శ్రీనివాస్ తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ సొంతం చేసుకున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం.
కాగా, ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో ఛత్రపతి సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్గా చేస్తోంది. ఇటీవలె ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లింది.