మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం `బిబి3` వర్కింగ్ టైటిల్తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ద్వారక క్రియేషన్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రగ్వా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇంకా టైటిల్ ప్రకటించని ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న విడుదల చేయనున్నట్టు ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ప్రకటించిన తేదీకి సినిమాను విడుదల చేయగలమా అన్న టెన్షన్లో బోయపాటి, బాలయ్య ఉన్నారని అంటున్నారు.
ఈ సినిమా ఇంకా నలబై శాతం చిత్రీకరణ జరుపుకోవాల్సి ఉంది. మాములు సమయాల్లో అయితే ఈ టైమ్ చాలు కానీ ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తోంది. ఆ ఎఫెక్ట్ షూటింగ్పై పడితే.. ఖచ్చితంగా అనుకున్న తేదీకి షూటింగ్, పోస్ట్ ప్రొడెక్షన్ పనులు పూర్తి చేసి విడుదల చేయడం చాలా కష్టం. అందుకే బిబి3 చిత్ర యూనిట్ టెన్షన్ పడుతుందని అంటున్నారు.