బాలీవుడ్‌లో మ‌రో వార‌సుడు రాబోతున్నాడు..!!

అటు బాలీవుడ్ లో, టాలీవుడ్ లోను వార‌సుల‌కు కొద‌వ లేదు. తారలు తరాలుగా హీరోలు, హీరోయిన్ లు ఇండస్ట్రీకి వస్తూ, వెలిగిపోతుంటారు. ఇప్పుడు బాలీవుడ్‌లో మూడో త‌రం వార‌సుడు అడుగు పెట్ట‌బోతున్నాడు. ధ‌ర్మేంద్ర మ‌న‌వ‌డు రాజ్‌వీర్ డియోల్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న‌ట్లు ధ‌ర్మేంద్ర స్వయంగా ట్వీట్ చేశాడు. బాలీవుడ్ న‌టుడు స‌న్నీ డియోల్ కొడుకే ఈ రాజ్‌వీర్ డియోల్‌. అత‌న్ని రాజ‌శ్రీ ప్రొడ‌క్ష‌న్స్ బాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేయ‌నుంది.

రాజ్‌వీర్ ఎంట్రీ గురించి చెబుతూ త‌న ‌పై, త‌న కొడుకులు స‌న్నీ, బాబీ డియోల్‌ల ‌పై కురిపించిన ప్రేమ ,అభిమానాలు అత‌ని పైనా కూడా కురిపించాల‌ని ధ‌ర్మేంద్ర కోరాడు. అటు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సూర‌జ్ బార్‌జాత్యా కొడుకు అవ్‌నీష్ బార్‌జాత్యా ఇదే చిత్రంతో ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేస్తుండ‌టం మ‌రో విశేషం. అటు రాజ‌శ్రీ ప్రొడ‌క్ష‌న్స్ కూడా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో వీళ్లిద్దరి ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా రానున్న‌ట్లు తెలిపింది.