టాలీవుడ్లో నందమూరి-మెగా ఫ్యామిలీల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రెండు వంశాల్లో యంగ్టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్స్టార్ రాంచరణ్ ఇద్దరూ టాప్ హీరోలుగా ఉన్నారు. ఈ రెండు ఫ్యామిలీలకు చెందిన ఈ ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా చాటిన రాజమౌళి వీరి కాంబినేషన్లో మల్టీస్టారర్కు ప్లాన్ చేస్తున్నాడంటూ నాలుగైదు రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.
వీరిద్దరితో కలిసి రాజమౌళి దిగిన ఫొటో ఇటీవలే భయటకు రావడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. ఇక వీరి కాంబోలో మల్టీస్టారర్ సినిమాలపై లెక్కకు మిక్కిలిగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం రాజమౌళి తండ్రి, స్టార్ స్టోరీ రైటర్ విజయేంద్రప్రసాద్ అదిరిపోయే స్టోరీని వండి వార్చేపనిలో బిజీగా ఉన్నారట. బలమైన సోషల్ మెసేజ్తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా గురించి రెండు సూపర్ న్యూస్లు భయటకు వచ్చాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ 2018 సమ్మర్ లో స్టార్ అవ్వనుందని సమాచారం. ఇక సినిమాను డీవీవీ దానయ్య నిర్మించడానికి రెడీగా ఉన్నారు. రాజమౌళి దానయ్యతో ఓ సినిమా చేసేందుకు కమిట్ అవ్వడంతో దానయ్య బ్యానర్లోనే ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ నందమూరి – మెగా మల్టీస్టారర్ ప్రాజెక్టును రూ.150 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారట.