నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా నటించిన పైసా వసూల్ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూరి జగన్నాథ్ – బాలకృష్ణ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా సినిమా ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ రాబట్టుకుంది.
దర్శకుడు పూరి సినిమాలో తేడాసింగ్ క్యారెక్టర్ను ఆయన అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులు పిచ్చ పిచ్చగా మెచ్చేలా తెరకెక్కించడంతో పాటు ఫస్టాఫ్ చాలా బాగుండడంతో బీ, సీ సెంటర్లలో పైసా వసూల్ వసూళ్లు అదిరిపోతున్నాయి. బాలయ్య ఇప్పటి వరకు చేసిన 100 సినిమాల్లో నటనకు భిన్నంగా ఈ సినిమాలో నటన ఉండడం, బాలయ్య లుక్స్, మేనరిజమ్స్ అదిరిపోవడంతో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు మంచి వసూళ్ళని సాధించినట్లు తెలుస్తోంది. ఏపీ రాజధాని కేంద్రమైన కృష్ణా జిల్లాలో పైసా వసూల్ తొలి రోజు అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. తొలిరోజు రూ 52,70,747 షేర్ ని కృష్ణా జిల్లాలో పైసా వసూల్ చిత్రం సాధించింది. పైసా వసూల్ ఫస్ట్ డే పూర్తి వసూళ్ల వివరాలు అందాల్సి ఉంది.