టాలీవుడ్లో నాడు దివంగత లెజెండ్రీ హీరో ఎన్టీఆర్ – మోహన్బాబు మధ్య ఎలాంటి అనుబంధం ఉండేదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్-మోహన్బాబు తర్వాత ఈ రెండు ఫ్యామిలీల్లో నేటి తరం హీరోలు కూడా అదే అనుబంధంతో ఉంటారు. మోహన్బాబు, ఎన్టీఆర్ కలిసి ఎన్నో సినిమాలు చేస్తే, మోహన్బాబు వారసుడు మనోజ్, బాలయ్య కూడా కలిసి సినిమాలు చేశారు. అంత అవినాభావ సంబంధం ఈ రెండు కుటుంబాల మధ్య ఉంది.
అయితే లేటెస్ట్గా నందమూరి హీరో కళ్యాణ్రామ్ మంచు హీరో విష్ణుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట. విష్ణుకు కళ్యాణ్రామ్ ఎందుకు వార్నింగ్ ఇచ్చాడో తెలిస్తే కాస్త షాక్ అవుతాం. ఆచారి అమెరికా యాత్ర షూటింగ్ నేపథ్యంలో మలేషియాలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో హీరో మంచు విష్ణు గాయపడిన సంగతి తెలిసిందే.
దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ సినీ జనాలు, తెలుగు ప్రజలందరూ విష్ణుకు ఏం జరిగిందా ? అని కంగారుపడ్డారు. చాలా మంది విష్ణుకు, మంచు ఫ్యామిలీకి ఫోన్ చేసి ఆరా తీశారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో నితిన్ ఏం జరిగిందని విష్ణుకు ఫోన్ చేస్తే, కళ్యాణ్రామ్ అయితే విష్ణును బాగా తిడుతూ ఎస్ఎంఎస్ పెట్టాడట. పిల్లలున్నారని, రిస్క్ ఎందుకు చేస్తావని తన మంచి కోరి కొంచెం ఘాటుగా ఎస్ఎంఎస్ పెట్టినట్లు మంచు విష్ణు వివరించాడు. అది సంగతి.