బాహుబలి – ది కంక్లూజన్ రిలీజ్ అయ్యి మూడు వారాలు అవుతున్నా ఇంకా బాక్సాఫీస్ వద్ద దూకుడు తగ్గలేదు. వసూళ్లలో బాహుబలి ఇంకా తన జోరు చూపిస్తోంది. నాలుగో వీకెండ్లోను బాహుబలి 2 సత్తా చాటుతోంది. ఈ సినిమా రిలీజ్ అయిన 22వ రోజున కూడా ఏకంగా కోటిన్నర షేర్ వసూలు చేసిందంటే ఈ సినిమాకు ఇప్పటకీ ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థమవుతోంది.
ఈ 22 రోజుల్లో బాహుబలి 2 ఏపీ+తెలంగాణ నుంచి రూ. 179.45 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఏరియాల వారీగా చూస్తే నైజాం నుంచి 60.19 కోట్లు – సీడెడ్ 31.27 కోట్లు – ఉత్తరాంధ్ర 23.59 కోట్లు – గుంటూరు 16.32 కోట్లు – ఈస్ట్ 15.77 కోట్లు – వెస్ట్ 11.48 కోట్లు – కృష్ణా 12.77 కోట్లు – నెల్లూరు 6.96 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. కేవలం ఏపీ నుంచే ఏకంగా రూ. 120 కోట్లు రాబట్టడం పెద్ద రికార్డుగా చెప్పుకోవాలి.
బాహుబలి 2 నాలుగో వారంలోకి ఎంటర్ అవుతున్నా ఆ తర్వాత రిలీజ్ అయిన బాబు బాగా బిజీ, రాధా నిరాశపరచడం, కేశవకు మంచి టాక్ వచ్చినా బాహుబలి 2ను ఎదుర్కొనే స్టామినా లేకపోవడంతో బాహుబలి 2 ఏపీ+తెలంగాణ నుంచే రూ. 200 కోట్ల షేర్ సులువుగా వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.