ఎన్నారై యువ‌కుడితో శ్రియా భూపాల్ మ్యారేజ్‌..!

టాలీవుడ్‌లో టాప్ ఫ్యామిలీ అయిన అక్కినేని ఫ్యామిలీ హీరో అఖిల్, ప్రముఖ పారిశ్రామిక‌వేత్త జీవీకే.రెడ్డి మ‌నువ‌రాలు శ్రియా భూపాల్‌రెడ్డి ప్రేమాయ‌ణం – ఎంగేజ్‌మెంట్ – పెళ్లి అన‌గానే అదో సంచ‌ల‌న వార్త అయ్యింది. వీరిద్ద‌రి ఎంగేజ్‌మెంట్ గ్రాండ్‌గా ఓ రేంజ్లో జ‌రిగింది. ఇక వీరు పెళ్లి పీట‌లు ఎక్కేందుకే అంతా సిద్ధం..ఇట‌లీలో వీరి పెళ్లి అన‌గానే తెలుగు మీడియా మొత్తం ఈ వార్త‌ల‌నే ట్రెండ్ చేసింది.

అయితే తీవ్ర‌మైన మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో వీరి పెళ్లి క్యాన్సిల్ అవ్వ‌డంతో అదే మీడియా వీరి పెళ్లి క్యాన్సిల్ వార్త‌ల‌ను ఎవ‌రికి తోచిన‌ట్టుగా వారు రాసేసుకున్నారు. ఈ దెబ్బ‌కు నాగార్జున కొద్ది రోజుల వ‌ర‌కు బ‌య‌ట‌కే రాలేదు. అఖిల్ కంటే శ్రియా భూపాల్ వ‌య‌స్సులో నాలేగేళ్లు పెద్ద‌ది అయినా అఖిల్ బ‌ల‌వంతంగా నాగ్ వీరి పెళ్లికి ఒప్పుకుని ఎంగేజ్‌మెంట్ చేయ‌క‌త‌ప్ప‌లేదు.

ఇక పెళ్లి క్యాన్సిల్ అవ్వ‌డంతో అఖిల్ విక్ర‌మ్ కుమార్ డైరెక్ష‌న్‌లో త‌న రెండో సినిమాలో న‌టిస్తున్నాడు. ఇక ఇప్పుడు జీవీకే ఫ్యామిలీ అక్కినేని ఫ్యామిలీని మించే ఫ్యామిలీకి చెందిన ఎన్నారై యువ‌కుడితో శ్రియా భూపాల్ పెళ్లి ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఆ ఎన్నారై యువ‌కుడికి నాగార్జున ఆస్తుల కంటే నాలుగైదు రెట్లు ఎక్కువ ఆస్తులు ఉన్న‌ట్టు స‌మాచారం.

అమెరికాలో సెటిల్ అయిన ఆ ఎన్నారై యువ‌కుడు అక్క‌డ ప‌లు బిజినెస్‌లు చేస్తూ కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తాడ‌ట‌. ఈ యేడాదిలోనే ఆ యువ‌కుడితో శ్రియా పెళ్లి ఉంటుంద‌ని స‌మాచారం.