మూడు సూప‌ర్ షాక్‌లు ఇచ్చిన మ‌హేష్‌

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు త‌న ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూ ఇయ‌ర్ గిఫ్ట్ ఇచ్చాడు. ఒకేసారి త‌న మూడు నెక్ట్స్ ప్రాజెక్టుల‌ను ఎనౌన్స్ చేశాడు. ప్ర‌స్తుతం సౌత్ ఇండియ‌న్ క్రేజీ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ డైరెక్ష‌న్‌లో న‌టిస్తోన్న మ‌హేష్‌బాబు ఈ యేడాది ఏకంగా మూడు సినిమాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశాడు. ఇప్ప‌టికే కొర‌టాల శివ – వంశీ పైడిప‌ల్లి సినిమాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన మ‌హేష్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌కు సైతం గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశాడు.

న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా త‌న ఫ్యాన్స్‌కు శుభాకాంక్ష‌లు చెప్పిన మ‌హేష్ త‌న ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ అంటూ త‌న మూడు నెక్ట్స్ ప్రాజెక్టుల డీటైల్స్‌ను ప్ర‌క‌టించాడు. త‌న 24వ సినిమాను కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాను డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డీవీవీ దానయ్య నిర్మించ‌నున్నారు.

ఇక మ‌హేష్ కేరీర్‌లో 25 వ సినిమాను వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంది. ఈ సినిమాను దిల్ రాజు – అశ్వ‌నీద‌త్ సంయుక్తంగా నిర్మిస్తారు. 26వ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేస్తాన‌ని మ‌హేష్ ఈ ప్రాజెక్టుల విష‌యాల‌ను త‌న ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు.

ఇక త‌న కేరీర్‌లో మురుగ‌దాస్‌తో క‌లిసి ప‌ని చేయాల‌న్న కోరిక తీరింద‌ని..ఈ సినిమా రిలీజ్ కోస‌మే వెయిట్ చేస్తున్న‌ట్టు చెప్పాడు. ఏదేమైనా మ‌హేష్ వ‌రుస‌పెట్టి టాప్ డైరెక్ట‌ర్ల‌తో సినిమాలు ఫిక్స్ చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.