ఎన్టీఆర్ – బాల‌య్య మ‌ల్టీస్టార‌ర్‌

టాలీవుడ్‌లో టాప్ ఫ్యామిలీ అయిన నంద‌మూరి ఫ్యామిలీకి చెందిన స్టార్ హీరోలు యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ – యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌ధ్య గ్యాప్ ఉంద‌న్న ప్ర‌చారం తెలిసిందే. అయితే నంద‌మూరి అభిమానులు మాత్రం వీరిద్ద‌రు ఎప్పుడు క‌లిసిపోతారా ? వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఎప్పుడు మ‌ల్టీస్టార‌ర్ సినిమా వ‌స్తుందా ? అని ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు.

నంద‌మూరి అభిమానుల ఆశ ఎలా ఉన్నా ఇప్పుడు ఓ టాప్ ప్రొడ్యుస‌ర్ వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ సినిమా తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. టాలీవుడ్‌లో టాప్ ప్రొడ్యుస‌ర్ కం డిస్ట్రిబ్యూట‌ర్ దిల్ రాజు రీసెంట్‌గా సంక్రాంతికి శ‌త‌మానం భ‌వ‌తి సినిమాతో సూప‌ర్ హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు.

ఇక ఫిబ్ర‌వ‌రి 3న నాని హీరోగా రాజు నిర్మించిన నేను లోక‌ల్ సినిమా సైతం రిలీజ్ అవుతోంది. ఇక రాజు వ‌రుణ్‌తేజ్‌తో ఫిదా సినిమా కూడా తీస్తున్నాడు. ర‌వితేజ‌తో మరో సినిమా చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు రాజు వ‌ద్ద మ‌రో అదిరిపోయే క‌థ ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఆ క‌థ‌తోనే అక్కినేని హీరోలు నాగార్జున – నాగ‌చైత‌న్య‌తో మ‌ల్టీస్టార‌ర్ సినిమా తీస్తున్న‌ట్టు రాజు ఎనౌన్స్ చేశాడు. అయితే దీనిపై నాగార్జున భిన్నంగా స్పందించ‌డంతో ఈ ప్రాజెక్టు అక్కినేని హీరోల‌తో ఉంటుందా ? లేదా ? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఇప్పుడు ఇదే స్టోరీతో బాల‌య్య‌-ఎన్టీఆర్ కాంబోలో మ‌ల్టీస్టార‌ర్ చేస్తే ఎలా ఉంటుందా ? అని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడ‌ట‌.

మ‌రి ఈ క‌థ‌తో బాల‌య్య‌-ఎన్టీఆర్ కాక‌పోయినా బాల‌య్య‌-మోక్ష‌జ్ఞ చేసినా అదిరిపోతుంద‌న్న టాక్ కూడా ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది. ఏదేమైనా నంద‌మూరి హీరోల‌తో ఈ మ‌ల్టీస్టార‌ర్ సెట్ చేస్తే సినిమా క్రేజ్ మామూలుగా ఉండ‌దు.