బాలయ్య..ఎన్టీఆర్ మధ్య విభేదాలు తొలిగాయా!

నందమూరి బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’తో సెంచరీ కొట్టబోతున్నారు, ఆ మైలురాయి చేరుకోవడానికి ఇక రెండు నెలల దూరమే ఉంది, క్రిష్ డైరెక్షన్‌లో తీస్తున్న ఈ సినిమా ఇప్పటికే అనుకున్న టైం కంటే ఒక్క రోజు ముందే షూటింగ్ కూడా పూర్తి చేసుకుందన్న వార్తలూ వచ్చాయి. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ముందు నిర్ణయించినట్టుగానే సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇక పోతే జూనియర్ ఎన్టీఆర్.. జనతాగ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎంతో మంది డైరెక్టర్ల పేర్లు తెరపైకి వచ్చినా అదేదీ  ఫలించినట్టు కనిపించలేదు. ఇప్పటికీ ఎన్టీఆర్ సినిమాపై అదే సందేహం కొనసాగుతోంది. దీనిలో భాగంగా హిట్ దర్శకులు అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ , వీవీ వినాయక్. జగన్నాథ్ పేర్లు తెర పైకి వచ్చాయి కానీ అవేవి ముందుకు వెళ్ళలేదు.

  గత రెండు మూడు ఏళ్లగా బాలయ్య కి ఎన్టీఆర్ కి మధ్య విబేదాలు గురించి అందరికి తెలిసిందే. ఇప్పుడు పరిస్థితి మారినట్టు అనిపిస్తుంది వారి సినిమాలపై ఇద్దరూ ఒక అండర్ స్టాండింగ్‌కు వచ్చినట్టు తెలుస్తోంది.  ఇద్దరు హీరోలు తమ డైరెక్టర్లను ఎక్స్‌చేంజ్ చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి, బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా తర్వాత రైతు సినిమాను తీయాలనుకున్నా.. పక్కనపెట్టుకొని తన తర్వాతి సినిమాను పూరీ జగన్నాథ్‌తో తీయాలని బాలయ్య భావిస్తున్నాడట.

అందుకే తొలుత పూరీకి దాదాపు ఫిక్స్ అయిన ఎన్టీఆర్.. ఆ సినిమా (డైరెక్టర్)ను బాబాయ్‌కు ఇచ్చేందుకు అంగీకరించాడట. ఇక, ఇటు కృష్ణవంశీ సినిమాలో ఎన్టీఆర్ నటించేందుకు ఓకే చెప్పాడని టాలీవుడ్‌లో టాక్. ఇద్దరు వారి దర్శకులను మార్చుకొని తమ మధ్య విబేదాలు లేవని సినీ ఇండస్ట్రీలో చాటిచెప్పారని అనుకుంటున్నారు.