మల్టిస్టారర్ సినిమాలకు టాలీవుడ్లో ఇప్పుడు క్రేజ్ చాలా పెరిగిపోయింది. టాలీవుడ్లో గతంలో ఈ సినిమాలకు ఎంతో క్రేజ్ ఉండేది. సీనియర్ హీరోలు ఎన్టీఆర్ – ఏఎన్నార్ – కృష్ణ – శోభన్బాబు – కృష్ణంరాజు వీరందరూ మల్టీస్టారర్ సినిమాల్లో నటించారు. అయితే ప్రస్తుతం జనరేషన్లో మల్టీస్టారర్ సినిమాల్లో నటించేందుకు స్టార్ హీరోలు అంగీకరించడం లేదు.
అయితే ప్రస్తుత జనరేషన్లో ఉన్న హీరోలు ఇలాంటి సినిమాలు తీస్తే వాటికి ఉండే క్రేజే వేరు. అందుకే అలాంటి సినిమాలు తీసేందుకు దర్శకనిర్మాతలు సైతం ఆసక్తిని చూపుతున్నారు. టాలీవుడ్లో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ మాత్రమే మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తున్నాడు.
వెంకీ మహేష్తో ఎస్వీఎస్, పవన్తో గోపాలా…గోపాలా, యంగ్ హీరో రామ్తో మసాలా సినిమాల్లో నటించాడు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్, బన్నీ కాంబినేషన్లో ఓ మల్టిస్టారర్ రాబోతున్నట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కాంబోలో మల్టీస్టారర్ తెరకెక్కించేందుకు వరుస ప్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడట.
పూరి ఇప్పటికే ఈ ఇద్దరు హీరోలకు ఆ కథను కూడా వినిపించారట. అయితే వరుస హిట్లతో జోరుమీదున్న ఈ ఇద్దరు హీరోలు పూరిని ఎంత వరకు నమ్ముతారో..ఈ ప్రాజెక్టు ఎంత వరకు సెట్స్మీదకు వెళుతుందో మాత్రం చెప్పడం కష్టం.