చెప్పు తెగుద్ది నట్టికుమార్:కళ్యాణ్

నిర్మాత నట్టికుమార్ గత 4 రోజులుగా మీడియాలో హల్చల్ చేస్తున్నాడు.గ్యాంగ్ స్టర్ నయీమ్ తో తెలుగు బడా నిర్మాతలకు సంబంధాలున్నాయని సంచలన ఆరోపణలు చేస్తూనే వున్నాడు. సి.కళ్యాణ్,బూరుగుపల్లి శివరామకృష్ణ,బండ్ల గణేష్,సచిన్ జోషి,అశోక్ కుమార్ వంటి వారందరికీ నయీమ్ తో సంబంధాలున్నాయంటూ దానికి తనదగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని ఎడా పెడా టీవీ లో వాయించేస్తున్నాడు నట్టి.

ఆరోపించిన వారిలో ఎవరు పెద్దగా ప్రతిఘటించిన దాఖలాలు లేవు.కనీసం ఇంతవరకు వారిలో ఎవరూ కూడా ఈ ఆరోపణలకు గట్టిగా కౌంటర్ కూడా ఇవ్వలేదు.దీంతో సర్వత్రా నట్టికుమార్ ఆరోపణల్లో నిజముందేమో అనే అనుమానాలు మొదలయ్యాయి.

అయితే తాజాగా సి.కళ్యాణ్ ఈ విషయం పై స్పందించారు.స్పందించడం అంటే ఎదో తాపీగా ఇది పద్దతికాదు..ఈ వ్యాక్యలని నేను ఖండిస్తున్నా అని సాఫ్టుగా కాదు..ఊర మాస్ గా ఖండించారు.నట్టికుమార్ ఓ పిచ్చి కుక్క,నట్టికుమార్ చెప్పు తెగుద్ది..రోడ్డు పై ఈడ్చి ఈడ్చి కొడతా..పిచ్చి పిచ్చి ఆరోపణలు మానుకో..నువ్వెంత నీ బతుకెంత.. అని ఘాటుగా జవాబిచ్చాడు కళ్యాణ్.

అసలు నట్టికుమార్ జీవితమంతా బ్లాక్మెయిల్ చేసే బ్రతికాడని..ఇప్పుడు కూడా పబ్లిసిటీ కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడన్నారు కళ్యాణ్.ఇంకా నట్టి కుమార్ బాధితుల పేరుతో ఒక సెల్ ఓపెన్ చేస్తే అందులో నయీమ్ కంటే ఎక్కువమంది బాధితులుంటారన్నారు.అసలు నట్టికుమార్ ఎంత మంది అమ్మాయిల్ని బ్లాక్ మెయిల్ చేసాడో అడగండి..నీలిచిత్రాలు తీసుకుని బ్రతికేవాడు నాపై ఆరోపణలా అంటూ కళ్యాణ్ నెత్తికి గట్టిగానే జవాబిచ్చాడు.

క్రీస్తు పేరు చెప్పుకుని డబ్బు దండుకునే వాడు నట్టికుమార్..వాడా నాపై ఆరోపణలు చేసేది..అంటున్నాడు కళ్యాణ్.అయితే దీనికి నట్టి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి మరి.నిజంగా నట్టికుమార్ దగ్గర ఏవయినా ఆధారాలున్నాయా..ఒక వేళ ఉంటే ఇంత నాన్చుడేందుకు ..లేకపోతే కళ్యాణ్ చెప్పినట్టు ఇలా పబ్లిసిటీ తో బ్లాక్ మెయిల్ చేసి డబ్బు సంపాదించే గేమ్ ప్లాన్ చేశాడా నట్టికుమార్?..చూద్దాం నట్టి రియాక్షన్ ఎలా ఉంటుందో.