వైజాగ్ లో రామ్ సందడి

నేను శైలజ’ హిట్ తరువాత కొంత గ్యాప్ తీసుకుని రంగంలోకి దిగాడు రామ్. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో ప్రారంభించారు. ఈ షెడ్యూల్ లో ఒక పాటతో పాటూ యాక్షన్ ఎపిసోడ్, కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. పాటలో కొంత పార్ట్ ను ఇప్పటికే చిత్రీకరించారు. మరో 15రోజులు వైజాగ్ లోనే షూటింగ్ సాగనుంది.

14 రీల్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన కథానాయికగా రాశిఖన్నా నటిస్తోంది. గిబ్రాన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను ‘దసరా’కి రిలీజ్ చేయాలనే ఆలోచనలో వున్నారు. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ – రామ్ కాంబినేషన్ లో గతంలో ‘కందిరీగ’ సినిమా వచ్చింది. కందిరీగతో హిట్ కొట్టినట్లే ఈసారి కూడా సక్సస్ అవ్వాలని ఇరువురూ గట్టి పట్టుదలతో వున్నారు.