విశాల్‌ ‘సెల్ఫీ ట్వీట్‌’ సెన్సేషన్‌ 

హీరో విశాల్‌ సెల్ఫీ ట్వీట్‌ సెన్సేషన్‌ సృష్టించింది. ఇందులో విశాల్‌తోపాటు తమిళ హీరోయిన్‌ వరలక్ష్మి శరత్‌కుమార్‌ కూడా ఉంది. ఇద్దరి క్లోజ్‌నెస్‌కి ఈ ఫొటో అద్దంపడుతుంది. అయితే వరలక్ష్మి తండ్రి, శరత్‌కుమార్‌తో విశాల్‌కి విభేదాలున్నాయి. శరత్‌కుమార్‌ అనారోగ్యంతో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్న వేళ విశాల్‌ ఇలా చేయడం సమంజసంగా లేదు. తన ప్రేమని వ్యక్తపరచుకోడానికి విశాల్‌కి స్వేచ్ఛ ఉందిగానీ, సందర్భం లేకుండా వ్యవహరించడం బాగాలేదు. తమిళంలో విశాల్‌ పాపులర్‌ హీరో. శరత్‌కుమార్‌ సీనియర్‌ నటుడు. తెలుగు ప్రేక్షకులకీ సుపరిచితుడే. అంతేకాదు అందరికీ అత్యంత ఆప్తుడు శరత్‌కుమార్‌. దాంతో శరత్‌ కుమార్‌ ఆరోగ్యం రీత్యా, తెలుగు ప్రేక్షకులు విశాల్‌ మీద గుర్రుమంటున్నారు. విశాల్‌కిది తగదని గట్టిగా వారిస్తున్నారు. హీరో విశాల్‌, ఈ విషయంలో కొద్దిగా ఆలోచించాల్సి ఉంటే బాగుండేదని సలహాలు ఇస్తున్నారు.

ఈ విషయం కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా హాట్‌ టాపిక్‌ అయిపోయింది. తొందరపాటుతో వ్యవహరించిన విశాల్‌ శైలిని అందరూ ఖండిస్తున్నారు. దాంతో విశాల్‌ మీద నెగెటివ్‌ ఇంపాక్ట్‌ పడుతుంది. మరి ఈ తొందరపాటు చర్యను విశాల్‌ ఎలా రెక్టిఫై చేసుకుంటాడో చూడాలి. కోలీవుడ్‌లో ఎంతో భవిష్యత్తు ఉన్న విశాల్‌ సీనియర్‌ నటులతో వ్యవహారాన్ని ఇలా పెద్దది చేసుకోవడం మంచిది కాదు. సామరస్యంగా చక్కబెట్టుకుంటే బాగుంటుంది. ఏమంటావ్‌ విశాల్‌.