ఆ ఒక్క‌టి చేస్తే.. ఈ తిప్ప‌లు త‌ప్పేవిగా బాబూ…!

ఔను! టీడీపీలోకొంద‌రు సీనియ‌ర్లు ఇదే మాట చెబుతున్నారు. ఇప్ప‌టికే పార్టీ ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చి మూడేళ్లు అయిపోయింది. అయితే.. ఈ మూడేళ్ల కాలంలో చంద్ర‌బాబుకానీ, పార్టీ కానీ.. ఏం చేసిందంటే.. జ‌గ‌న్ స‌ర్కారుపై విరుచుకుప‌డింది. ప్ర‌తిప‌క్షంగా ఆప‌ని చేయ‌డంలో త‌ప్పులేదు. అయితే.. అదేస‌మ‌యంలో కేవ‌లం విరుచుకుప‌డేందుకు.. ప్ర‌భుత్వంలోని లోపాల‌ను ఎత్తి చూపేందుకు మాత్ర‌మే ప్రాధాన్యం ఇవ్వ‌కుండా.. పార్టీ ప‌రంగా కూడా దృష్టి పెట్టి ఉంటే బాగుండేద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ల స‌మ‌యం ఉంది. ఈ నేప‌థ్యంలో […]

ఇలా చేసి ఏం సందేశం ఇస్తున్నావ్.. జ‌గ‌న్‌కు డైరెక్ట్ క్శ‌శ్చ‌న్‌…!

తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీ తీవ్ర‌మైన క‌ల‌క‌లం రేగుతోంది. అస‌లు జ‌గ‌న్ ఉద్దే శం ఏంటి? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇలా చేసి పార్టీ నేత‌ల‌కు ఎలాంటి సందేశం ఇస్తున్నారు? అనే చ‌ర్చ జోరుగా జ‌రుగుతోంది. ఎందుకంటే.. అటు ఎమ్మెల్సీ టికెట్లు కానీ, ఇటు రాజ్య‌స‌భ స్థానాలు కానీ.. జ‌గ న్ ఇస్తున్న తీరు.. నేత‌ల‌ను విస్మ‌యానికి గురి చేస్తోంది. ఎందుకంటే.. పార్టీలో ఆది నుంచి ఉండి.. జ‌గ‌న్ కోసం.. జెండాలు ప‌ట్టుకుని.. రోడ్డు ఎక్కిన […]

వైసీపీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థులు వీళ్లే.. ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిన జ‌గ‌న్‌…!

ఏపీలో అధికార వైసీపీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థులు దాదాపు ఖ‌రార‌య్యారు. ఖాళీ అవుతున్న నాలుగు స్థానాల‌ను భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ వెలువ‌డింది. ఈ నాలుగు స్థానాలు అధికార‌ వైసీపీకి ద‌క్క‌నున్నాయి. ఈ ప‌ద‌వుల కోసం పార్టీలో చాలా పోటీ నెల‌కొంది. పార్టీ కీల‌క‌నేత విజ‌య‌సాయిరెడ్డిని మ‌ళ్లీ కొన‌సాగించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో వైసీపీ అభ్య‌ర్థుల ఎంపిక‌పై జ‌గ‌న్ తీవ్రంగా క‌స‌ర‌త్తు చేశారు. విజ‌య‌సాయిరెడ్డిని మ‌ళ్లీ కొన‌సాగించ‌నున్నార‌ని స‌మాచారం. ఇక మిగిలిన మూడు స్థానాల‌కు ప్ర‌ముఖ న్యాయ‌వాది, నిర్మాత నిరంజ‌న్‌రెడ్డి, […]

బెట్టు చేస్తే బొక్కే… టీడీపీ – జ‌న‌సేన‌తో పొత్తుపై బీజేపీ ట్విస్ట్ ఇచ్చేసింది…!

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి రాష్ట్రంలో పొత్తులు పొడిచేందుకు రంగం సిద్ధ‌మైంది. టీడీపీ-జ‌న‌సేన‌లు పొత్తు దిశ‌గా స‌మాలోచ‌న‌లు చేస్తున్నాయ‌నే వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. అయితే.. టీడీపీతో క‌లిసి ప‌నిచే సేందుకు.. బీజేపీ స‌సేమిరా అంటోంది. గ‌తంలో మోడీని చంద్ర‌బాబు అవ‌మానించార‌ని.. ఆయ‌నకు వ్య‌తిరేకంగా.. పార్ల‌మెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టార‌ని.. కుటుంబం లేని వారికి మ‌హిళ‌ల విలువ ఏం తెలుస్తుందంటూ..వ్యాఖ్యానించార‌ని.. అలాంటి పార్టీతో పొత్తుకు తాము ఎలా ముందుకు వ‌స్తామ‌ని.. పార్టీ నేత‌లు చెబుతున్నారు. ఈ విష‌యంలో ఓ వ‌ర్గం […]

షాకింగ్‌: రాజ‌కీయాల‌కు ముగ్గురు వైసీపీ రెడ్డి ఎమ్మెల్యేలు గుడ్ బై…!

ఏపీలో అధికార వైసీపీలో రెడ్డి సామాజిక వ‌ర్గం ఎమ్మెల్యేలు ఓ రేంజ్‌లో ర‌గులుతున్నారు. వీరి బాధ‌లు అయితే మామూలుగా లేవు. పేరుకు మాత్ర‌మే త‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ఉన్నా త‌మ‌ను జ‌గ‌న్ ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని… పైగా స‌జ్జ‌ల లాంటి వాళ్లే పైన చ‌క్రాలు తిప్పేస్తూ ఉండ‌డంతో రాజ‌కీయంగా ద‌శాబ్దాల నుంచి త‌మ‌కు ఎంత అనుభ‌వం ఉన్నా ఉపయోగం లేద‌ని వారు వాపోతున్నారు. పార్టీలో రెడ్డి ఎమ్మెల్యేలు ఏకంగా 50 మంది […]

పీకేను పిండేయబోతున్న జగన్ ..ఎలాగంటారా ఇలా ?

ఔను! ఇప్పుడు ఈ సందేహాలు కూడా వ‌స్తున్నాయి. రాజ‌కీయాల్లో ఇది అర్హ‌మైన‌ది.. ఇది కాదు.. అని చెప్ప డానికి ఛాన్స్ లేదు. ఎప్పుడు ఎక్క‌డ ఎలాంటి అవ‌స‌రం వ‌చ్చినా.. నాయ‌కులు ఆయా అవ‌స‌రాల‌ను త‌మ కు అనుకూలంగా మార్చుకునేందుకు ఖ‌చ్చితంగా ప్ర‌య‌త్నాలు చేస్తారు. ఇప్పుడు.. ఏపీ సీఎం జ‌గ‌న్ కూ డా భ‌విష్య‌త్తులో ఇలాంటి వ్యూహ‌మే వేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. రేపు వ‌చ్చే ఎన్నిక‌ల్లో.. పోటీ తీవ్ర‌త పెరి గి.. త‌ను గెల‌వడం క‌ష్ట‌మ‌ని అనుకున్న‌ప్పుడు.. సెంటిమెంటును […]

విజ‌య‌వాడ వైసీపీ టిక్కెట్ కోసం ఇంత పోటీ ఉందా….?

రాష్ట్రంలోని ఏ పార్టీకైనా.. విజ‌య‌వాడ న‌గ‌రం కీల‌కం. ఇక్క‌డ ప‌ట్టు పెంచుకుంటే..రాష్ట్రంలో ఎక్క‌డైనా వాయిస్ వినిపించ‌వ‌చ్చ‌నే ధీమా ఉంటుంది. ఇలా చూసుకుంటే.. ప్ర‌స్తుతం వైసీపీకి ఇక్క‌డ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీకి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఉన్నారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటి ప‌రిస్థితి చూస్తే.. వైసీపీకి తూర్పు, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాల‌పై ఉన్న భ‌రోసా..సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంపై లేదు. ఇక్క‌డ ఎమ్మెల్యేగా ఉన్న బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌ల్లాది విష్ణు ఉన్నారు. అయితే.. ఆయ‌న ప‌నితీరు […]

టీడీపీపై ప్రేమ కురిపిస్తోన్న వైసీపీ ఎమ్మెల్యే…!

తెలుగు వారి ఆత్మ‌గౌర‌వ నినాదంతో ఏర్ప‌డిన తెలుగు దేశం పార్టీకి ఏ టా వ‌చ్చే పండుగ మ‌హానాడు. ప్ర‌తి మే నెల‌లోనూ.. ప‌సుపు పండుగ‌ను ఘ‌నంగా చేసుకుంటారు. పార్టీ కార్య‌క్ర‌మాల‌ను.. భూత, భ‌విష్య‌త్, వ‌ర్త‌మాన కాలంలో పార్టీ నిర్దేశాల‌ను కూడా ఈ స‌భ‌లో చ‌ర్చించుకుని.. తీర్మానాలు చేసుకునే ఈ కార్య‌క్ర‌మానికి పార్టీ ముఖ్య నేత‌లు అంద‌రూ కూడా హాజ‌రు కావ‌డం తెలిసిందే. అయితే.. గ‌త రెండేళ్లుగా క‌రోనా మ‌హ‌మ్మారి కారణంగా.. మ‌హానాడును వ‌ర్చువ‌ల్‌గా నిర్వ‌హించుకున్నారు. ఈ సారి […]

జ‌గన్…ఎమ్మెల్యేల గోడు ప‌ట్ట‌దా….!

ఏపీలో త‌న పాల‌న బాగుంద‌ని.. త‌న‌ను మించిన విధంగా పాలించిన నాయ‌కుడు లేర‌ని.. వైసీపీ అధినేత‌.. సీఎం జ‌గ‌న్ భావిస్తున్నారు.. ఇది మంచిదే. నాయ‌కుడిగా.. ఇలా అనుకోక‌పోతే. ఎవ‌రూ స్థిమితంగా.. ఆ సీఎం సీట్లో కూర్చోలేదు. నిద్ర కూడా పోలేరు. గ‌తంలో పాలించిన రోశ‌య్య నుంచి కిర‌ణ్‌కుమార్ రెడ్డి ప్ర‌భుత్వాల వ‌ర‌కు కూడా అంద‌రూ ఇలానే అనుకున్నారు. నాయ‌కులు క‌దా.. ఇలా అనుకుంటేనే వారికి మ‌నశ్శాంతి కూడా. పైగా.. జ‌గ‌న్‌ది ప్రాంతీయ పార్టీ.. అధిష్టానం.. అధినేత‌.. అన్నీ […]