జ‌గ‌న్‌కి అస‌లు సిస‌లు ప‌రీక్ష స్టార్ట్‌!

క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక నిన్న మొన్న‌టి వ‌ర‌కు అధికార పార్టీలో చిచ్చు పెడితే.. ఇప్పుడు ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తిప‌క్ష పార్టీలో సొంత నేత‌ల నుంచే అసంతృప్తి మంట‌లు రాజుకుంటున్నాయి. భూమా నాగిరెడ్డి ఆక‌స్మిక మ‌ర‌ణంతో వ‌చ్చిన ఈ ఉప ఎన్నిక.. ఇప్పుడు జ‌గ‌న్‌కి అన్ని విధాలా అగ్ని ప‌రీక్ష‌గా మారింది. ఇక్క‌డ వైసీపీకి ఇన్‌చార్జ్‌గా ఉన్న రాజ్‌గోపాల్‌రెడ్డి.. ఈ స్థానం నుంచి పోటీ చేయాల‌ని ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాడు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ కూడా […]

శిల్పా, అఖిల ప్రియ‌ల్లో పొలిటిక‌ల్ స‌న్యాసం ఎవ‌రికో?! 

నంద్యాల ఉప ఎన్నిక‌ పొలిటిక‌ల్ హీట్‌ను ఓ రేంజ్‌లో పెంచేస్తోంది. అటు అధికార టీడీపీ, ఇటు వైసీపీ అధినేత‌లు ఈ ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న విష‌యం తెలిసిందే. బాబేమో అభివృద్ది మంత్రం ప‌టిస్తుంటే… జ‌గ‌న్ మాత్రం సెంటిమెంట్‌ను న‌మ్ముకున్నారు. ఈ క్ర‌మంలో ఈ ఉప ఎన్నిక ఇరు ప‌క్షాల్లోనూ హీట్‌ను పెంచేసింది అని అంద‌రూ అనుకుంటున్నారు. అయితే, దీనికి మ‌రింత వేడి పెంచేస్తూ.. మంత్రి భూమా అఖిల ప్రియ పెద్ద కామెంట్లు చేశారు. ఈ ఉప ఎన్నిక‌ను […]

ఇదంతా అఖిల ప్రియ నిర్వాక‌మేన‌ని టీడీపీ నేత‌లు గుర్రు

ప‌ద‌విని చేప‌ట్టి ఏడాదైనా పూర్తికాకుండానే ప‌ర్యాట‌క శాఖా మంత్రి భూమా అఖిల ప్రియ.. తీవ్ర అసంతృప్తిని మూట‌గ‌ట్టుకున్నారా? ఆమెకు జై కొట్టిన నేత‌లు, నోళ్లే.. ఇప్పుడు ఆమెను విమ‌ర్శిస్తున్నారా? సొంత జిల్లా క‌ర్నూలు టీడీపీలోనే మంత్రి గారి వ్య‌వ‌హార శైలిపై నేత‌లు నొచ్చుకుంటున్నారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. విష‌యంలోకి వెళ్తే.. యువ మ‌హిళా మంత్రిగా బాబు కేబినెట్‌లో సీటు పొందిన భూమా కుమార్తెకు స్టార్టింగ్‌లో సొంత జిల్లాలో నేత‌లు, టీడీపీ కార్య‌క‌ర్త‌లు బ్ర‌హ్మ ర‌థం ప‌ట్టారు. […]

చంద్ర‌బాబు తీరుతో నేత‌ల్లో ఆందోళ‌న‌

పార్టీ కోసం ఎక్కువ స‌మ‌యాన్ని కేటాయిస్తాన‌ని సీఎం చంద్ర‌బాబు ప‌దేప‌దే చెబుతున్నా.. ఆచ‌ర‌ణ‌లో మాత్రం వాటిని ప‌ట్టించుకోవ‌డం లేదా? సుదీర్ఘంగా ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో ఏర్ప‌డుతున్న జాప్యం వ‌ల్ల పార్టీకి కొంత న‌ష్టం క‌లుగుతోందా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ముఖ్యంగా క‌ర్నూలు జిల్లాకు చెందిన శిల్పా మోహన్‌రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరిన త‌ర్వాత‌.. పార్టీ శ్రేణుల్లో ఈ అంశాలపై విస్తృత‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ముఖ్యంగా మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ త‌ర్వాత‌.. పార్టీలో అసంతృప్తుల సంఖ్య […]

ఏపీ పాలిటిక్స్‌లో సీన్ రివ‌ర్స్‌

ఏపీలో రాజ‌కీయాలు ర‌స‌కందాయంలో ప‌డ్డాయి. పార్టీ బ‌లోపేతం కోసం ఏపీ సీఎం చంద్ర‌బాబు నిన్న‌టి వ‌ర‌కు విప‌క్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యేల‌ను వ‌రుస‌పెట్టి సైకిల్ ఎక్కించేసుకున్నారు. దీంతో ఇక్క‌డ టీడీపీ బండి ఓవర్ లోడ్ అయ్యింది. వైసీపీ నుంచి వ‌చ్చిన కొత్త నాయ‌కుల‌కు అప్ప‌టి వ‌ర‌కు టీడీపీలో ఉన్న పాత నాయ‌కుల‌కు మ‌ధ్య కూల్‌వాట‌ర్ పోసినా పెట్రోల్ మాదిరిగా మండుతోంది. దీంతో కొత్త నాయ‌కుల‌తో పొస‌గ‌ని పాత నాయ‌కులు ఇప్పుడు రివ‌ర్స్ జంప్ చేస్తున్నారు. వారంతా టీడీపీకి […]

బాబు బాణం బాబుకే త‌గిలింది

ఏపీలో పార్టీని సంస్థాగ‌తంగా క‌న్నా నాయ‌కుల‌తో బ‌లోపేతం చేసేయాల‌ని క‌ల‌లు క‌న్న చంద్ర‌బాబు క‌ల‌లు రివ‌ర్స్ అయ్యాయి. ఏపీని అభివృద్ధి చేయ‌డం ద్వారానో లేదా పార్టీని సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేయాల‌నో చూడ‌కుండా చంద్ర‌బాబు విప‌క్ష వైసీపీ వాళ్ల‌ను త‌మ పార్టీలో చేర్చేసుకుంటే ఇక్క‌డ ఎమ్మెల్యేల కౌంట్ పెరిగిపోతుంద‌ని లెక్క‌లు వేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే వైసీపీకి చెందిన ఒక‌రిద్ద‌రు ఎంపీల‌తో పాటు 21 మంది ఎమ్మెల్యేలు, కొంద‌రు ఎమ్మెల్సీలు అధికార పార్టీ చెంత చేరిపోయారు. చంద్ర‌బాబు అనుకున్న‌ట్టు ఇక్క‌డ […]

నంద్యాల టెన్ష‌న్ బాబుకు తీరిన‌ట్టేనా 

నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత అక్క‌డ జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో ఎవ‌రు పోటీచేయాల‌నే అంశంపై టీడీపీలో కొంత‌కాలంగా సందిగ్ధం నెల‌కొంది. త‌మ వ‌ర్గానికి కేటాయించాల‌ని మంత్రి అఖిల‌ప్రియ వ‌ర్గం.. త‌మ వ‌ర్గానికే కేటాయించాల‌ని శిల్పా వ‌ర్గం ప‌ట్టుబ‌ట్ట‌డంతో.. ఇప్ప‌టివ‌ర‌కూ కొంత అనిశ్చితి నెల‌కొంది. అంతేగాక ఈ విష‌యంలో అధినేత‌ చంద్ర‌బాబు కూడా టెన్ష‌న్ ప‌డ్డారు. అయితే ఇప్పుడు ఆ టెన్ష‌న్ తీరిపోయింది. శిల్పా, భూమా వ‌ర్గాల మ‌ధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఈ వ‌ర్గాల‌ను ఒకే […]

టీడీపీలో మాజీ మంత్రి ర‌చ్చ ర‌చ్చ‌

క‌ర్నూలు టీడీపీలో విభేదాలు భ‌గ్గుమ‌న్నాయి, నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం లేక‌పోవ‌డంతో త‌మ్ముళ్ల మ‌ధ్య క‌ల‌హాలు బ‌య‌ట‌ప‌డ్డాయి! ముఖ్యంగా కొత్త‌గా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం ఇస్తుండ‌టంతో కొంద‌రు నేత‌లు ఫైర్ అవుతున్నారు. టీడీపీలోకి భూమా నాగిరెడ్డి ఎంట్రీతో కొంత కాలం నుంచి అసంతృప్తితో ఉన్ననంధ్యాల అసెంబ్లీ నియోజ‌వ‌ర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి శిల్పా మోహ‌న్ రెడ్డి తీరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో పార్టీ స‌మ‌న్వయ క‌మిటీ స‌మావేశం ర‌సాభాస‌గా మారింది, టీడీపీ జిల్లా […]