2019 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయంగా సమీకరణల మార్పు ఊపందుకుంటోంది. అందరినీ తానే తన పార్టీలోకి ఆహ్వానించాలని, మిగిలిన పక్షాలేవీ రాష్ట్రంలో ఉండకూడదని పెద్ద ఎత్తున లెక్చర్లు దంచికొడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయన సొంత పార్టీలోనే ఫిరాయింపులు ఊపందుకునే అవకాశం ఉందని తెలియడం లేదని అంటున్నారు రాజమండ్రి తమ్ముళ్లు! రాజకీయంగా అత్యంత కీలకమైన తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో టీడీపీకి పెద్ద దెబ్బే తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ కార్పొరేషన్ టీడీపీ కైవసం చేసుకుంది. మేయర్ అభ్యర్థిగా […]
Tag: rajumendry
2019రాజమండ్రి ఎంపీ సీటుపై టీడీపీ, వైసీపీ కొత్త ప్రయోగం!
ఏపీలో ఎవరైనా అధికారం దక్కించుకునేందుకు తూర్పు గోదావరి జిల్లా కీలకమైంది. ఈ జిల్లాలో మెజార్టీ సీట్లు గెలుచుకున్న పార్టీయే రాష్ట్రంలో అధికారంలో ఉంటుందన్న నానుడి ఉంది. గత మూడున్నర దశాబ్దాలుగాను ఈ సెంటిమెంట్ కంటిన్యూ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ జిల్లాలో రాజమండ్రి ఎంపీ సీటుకు రాజకీయంగా చాలా ప్రాధాన్యత ఉంది. రాజమండ్రి ఎంపీగా పోటీ చేసేందుకు ప్రధాన పార్టీల నుంచి ప్రముఖులే పోటీపడుతుంటారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ, వైసీపీ అభ్యర్థులుగా పోటీ […]
ఒకరు రాజకీయ పండితుడు మరొకరు వర్గ బలం ఉన్నవాడు
రెండు తెలుగు రాష్ట్రాల్లోను వచ్చే ఎన్నికల కోసం సీట్ల ఖర్చీఫ్ వేట అప్పుడే మొదలైంది. ఈ ఫైటింగ్ అన్ని నియోజకవర్గాల్లోను, అన్ని పార్టీలకు చెందిన నాయకుల్లోను కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలో కీలకమైన రాజమండ్రి లోక్సభ వైసీపీ సీటు కోసం ఇద్దరు కీలక నాయకుల మధ్య ఫైట్ నడుస్తోంది. టిక్కెట్ విషయంలో వీరిద్దరు నేరుగా తలపడకున్నా తమ పొలిటికల్ ఫ్యూచర్ కోసం వీరిద్దరు అదే స్థానంపై కన్నేశారు. వైసీపీలో సీనియర్ నేత, మాజీ మంత్రి అయిన పిల్లి […]
ఏపీ బీజేపీలో ఒంటరైన వీర్రాజు
ఏపీలో బీజేపీ, టీడీపీ మిత్రపక్షాలుగా ఉన్నా ఈ రెండు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో పొసగడం లేదన్నది నిజం. ఏపీ బీజేపీ చంద్రబాబు అనుకూల, చంద్రబాబు వ్యతిరేక వర్గాలుగా చీలిపోయింది. వీరిలో చంద్రబాబు వ్యతిరేకవర్గంలో ఆయన్ను, టీడీపీని టార్గెట్ చేసే వాళ్లలో రాజమండ్రికి చెందిన ఎమ్మెల్సీ సోము వీర్రాజుదే ఫస్ట్ ర్యాంకు. వీర్రాజుకు జాతీయ స్థాయిలో ఉన్న లాబీయింగ్తో ఇక్కడ టీడీపీ, చంద్రబాబుపై పదే పదే విమర్శలు చేస్తున్నారు. ఒకానొక దశలో ఆయనకే ఏపీ బీజేపీ పగ్గాలు అన్న […]
రాజకీయ చాణుక్యుడికి వైసీపీ ఎంపీ టిక్కెట్ ఖరారైనట్టే
ఏపీలో రాజకీయ పోరు నిన్నటి వరకు టీడీపీ, వైసీపీ మధ్యే ఉన్నా పవన్కళ్యాణ్ జనసేన ఎంట్రీతో ముక్కోణంగా మారింది. అయితే జనసేన ప్రభావం రాష్ట్రం మొత్తం ఉంటుందా ? లేదా కొన్ని నియోజకవర్గాలకే పరిమితమవుతుందా ? అని ప్రశ్నించుకుంటే ప్రస్తుతానికి జనసేన ప్రభావం కొన్ని చోట్ల మాత్రమే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈ వేడి ఎలా ఉంటే గతంలో కాంగ్రెస్లో ఓ వెలుగు వెలిగి, ఆ పార్టీలోనే ఉన్న వారు, ఆ పార్టీ నుంచి బయటకు […]
టీడీపీకి మరో ఎంపీ రాజీనామా?
2019 ఎన్నికల సమయానికి ప్రస్తుత టీడీపీ ఎంపీల్లో చాలామంది రాజీనామాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తనకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని, ఇందుకోసం ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని రాయపాటి సాంబశివరావు ప్రకటించేశారు. అయితే ఇదే పదవి కోసం పోటీపడుతున్న ఎంపీ మురళీమోహన్ కూడా తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం! ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో యాక్టివ్గా తిరగలేకపోతున్నారు. తన వారసురాలిగా కోడలు రూపాదేవిని తెరపైకి తీసుకొస్తున్నారు. ఇదే సమయంలో టీటీడీ […]
వైకాపాలోకి రాజకీయ మేథావి..!
సమైక్యాంధ్ర రాజకీయాల్లో తలపండిన మేథావిగా గుర్తింపు తెచ్చుకున్న ఓ సీనియర్ పొలిటిషీయన్ అడుగడుగులు వడివడిగా ఇప్పుడు వైసీపీ వైపే పడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఆ వ్యక్తికి దివంగత మాజీ సీఎం వైఎస్.రాజశేఖర్రెడ్డికి వీక్నెస్గా పేరుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు మాజీ ఎంపీ, అపర రాజకీయ చాణుక్యుడుగా పేరున్న ఉండవల్లి అరుణ్కుమార్. కాంగ్రెస్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఉండవల్లి అరుణ్కుమార్ రాజశేఖర్రెడ్డికి అత్యంత నమ్మకస్తుల్లో ఒకరు. ఉండవల్లి మాట అంటే వైఎస్ […]