నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం క్లైమాక్స్లో టీడీపీకి అదిరిపోయే చెంపదెబ్బ తగిలింది. ఇక్కడ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రావడానికి కొద్ది రోజుల ముందే చంద్రబాబు నంద్యాల నియోజకవర్గంలో ఉన్న అధికారులను అందరిని ట్రాన్స్ఫర్ చేసేసి తనకు అనుకూలంగా ఉండేవాళ్లను వేయించుకున్నారు. ఎస్సైలు, సీఐలు, డీఎస్పీలు, ఎస్పీ, ఐజీ, డీఐజీ ఇలా అందరిని బదిలీ చేసేసి కొత్తవాళ్లను అక్కడ బాబు సెట్ చేశారు. ఉప ఎన్నిక వేళ నోటిఫికేషన్ వస్తే తాను చెప్పినట్టు చేయాలని, అధికార టీడీపీకి అనుకూలంగా […]
Tag: Politics
ఆ మంత్రి బెదిరింపులతో చంద్రబాబుకు టెన్షనే..టెన్షన్
కడప జిల్లా జమ్మలమడుగు అధికార పార్టీ నేతలు అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా పరిణమించారు. మంత్రి ఆదినారాయణరెడ్డి నుంచి ఎమ్మెల్సీ.. రామసుబ్బారెడ్డి వరకు అందరూ బాబును బెదిరించేవారే అయిపోయారు. దీంతో ఇప్పుడు జమ్మలమడుగు రాజకీయాలంటేనే బాబుకు ఒకింత కంపరంగా మారాయట. అయినా కూడా పార్టీని నిలబెట్టుకునేందుకు ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారట. విషయంలోకి వెళ్తే.. జమ్మలమడుగు.. ఒకప్పుడు వైసీపీకి పెట్టనికోట. అయితే, అనూహ్యంగా చంద్రబాబు దృష్టి కడప జిల్లాపై పడింది. వైసీపీకి కంచుకోటగా ఉండే ఈ […]
కాకినాడలో టీడీపీ దెబ్బతో బీజేపీకి దిమ్మతిరిగి బొమ్మ కనపడుతోందా..
చంద్రబాబు పార్టీ టీడీపీ.. తాజాగా తన మిత్రపక్షం, 2014లో ఏపీలో తాను అధికారంలోకి వచ్చేందుకు దోహదపడిన బీజేపీకి ఝలక్ ఇచ్చింది. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తమకు పెద్ద పీట వేస్తుందని, మిత్రం పక్షం కాబట్టి టీడీపీ తమను నెత్తిన పెట్టుకుంటుందని భావించిన బీజేపీకి ఒక్కసారిగా షాక్ తగిలింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దాదాపు ఏడేళ్ల తర్వాత కార్పొరేషన్ ఎన్నికలకు నగారా మోగింది. ఇక్కడి మొత్తం 50 స్థానాల్లో 48 స్థానాలకు ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఈ క్రమంలో […]
కేంద్ర నిఘా సంస్థల నివేదికలో నంద్యాలలో వైసీపీ మెజార్టీ లెక్క ఇదే
నంద్యాల.. నంద్యాల.. నంద్యాల..! కర్నూలు జిల్లాలోని ఈ నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం చర్చనీయాంశంగా మారిపోయింది. ఆ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికపై ఇప్పుడు అందరి దృష్టీ పడింది. దీనికి ప్రధాన కారణం.. ఇక్కడ అధికార టీడీపీ, విపక్షం వైసీపీలు ఎవరికి వారు తమదే విజయం అంటే తమదేనని, తమదే భారీ మెజారిటీ అంటే .. కాదు తమదేనని ఒకరికొకరు లెక్కలు వేసుకుంటున్నారు. అంతేకాదు, విజయంపై గట్టి ధీమాగా కూడా ఉన్నారు. ఎవరికి వారు […]
నంద్యాలలో భూమా ఫ్యామిలీ టార్గెట్గా వెన్నుపోటు రాజకీయం
నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం ముగిసేందుకు మరో వారం రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. ఈ టైంలో అధికార టీడీపీలో లుకలుకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇక్కడ భూమా ఫ్యామిలీని టార్గెట్ చేసేందుకు టీడీపీలోనే కొందరు తెరవెనక మంత్రాంగం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. నంద్యాలలో భూమా ఫ్యామిలీ పాగా వేయడం టీడీపీలోనే కొందరికి నచ్చడం లేదు. వాళ్లు ఇక్కడ పాగా వేస్తే తమ రాజకీయ ఉనికికి ఇబ్బంది వస్తుందని, తమకు పదోన్నతి ఉండదని టీడీపీలోని కొన్ని […]
పాలిటిక్స్లోకి దిల్ రాజు.. కేసీఆర్ ఆఫర్ ఇదేనా!
సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రెండు రంగాలకు బలమైన అనుబంధం ఉంది. ఇక తమిళ్లో కంటే తెలుగులో మరింత బలమైన బంధం వీటి మధ్య ఉంది. ఇక టాలీవుడ్లో చాలా మంది నిర్మాతలు కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఈ క్రమంలోనే టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్ రాజు కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో నిర్మాతలు చాలామంది ఉన్నా సెలబ్రిటీ నిర్మాతలు […]
ఆ మైలేజీ స్ట్రాటజీ జగన్కే పెద్ద దెబ్బ!
మనిషన్నాక ఒకటి రెండు తప్పులు సహజం. ఇక, రాజకీయ నేతన్నాక.. మరో నాలుగు తప్పులు సహజం. కానీ, వైసీపీ అధినేత జగన్ ను చూస్తుంటే మాత్రం పదే పదే అదే తప్పులతో ఆయన తన ఇమేజ్నే కాకుండా పార్టీ ఇమేజ్ను కూడా తీవ్రస్థాయిలో తగ్గించేసుకుంటున్నారు. తాజాగా నంద్యాల ఉప ఎన్నికల విషయంలో ఆయన అనుసరిస్తున్న వైఖరి… చేస్తున్న కామెంట్లు.. సొంత పార్టీ నేతలకే నచ్చడం లేదంటే.. జగన్ వైఖరి ఎలా ఉందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. సాధారణంగా […]
పాలిటిక్స్లోకి తారకరత్న… ఆ అసెంబ్లీ సీటుపై కన్ను..!
2019 ఎన్నికలు ఏపీలో అధికార టీడీపీకి చావో రేవోగా మారనున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలవడం చంద్రబాబు ప్రతిష్టకు పెద్ద సవాల్గా మారనుంది. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల కోసం నారా, నందమూరి ఫ్యామిలీలో రెండూ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో నారా, నందమూరి ఫ్యామిలీల నుంచి మొత్తం నలుగురు ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపు ఖరారైంది. సీఎం చంద్రబాబు కుప్పం నుంచే పోటీ చేయడం ఖాయం. ఇక ఆయన తనయుడు, మంత్రి లోకేశ్ వచ్చే ఎన్నికల్లో తొలిసారి […]
ఆ ఇద్దరు మంత్రులపై వేటు తప్పదా!
నంద్యాల ఉప ఎన్నికల్లో తలమునకలై ఉన్న సీఎం చంద్రబాబుకు ఏపీ మంత్రులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు మధ్య వివాదాలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నా.. అవి ఇంకా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఉన్న సమస్యలకు తోడు ఇప్పుడు మరో ఇద్దరు మంత్రులు కూడా ఈ జాబితాలో చేరిపోయారట. ఒక మహిళా ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేంద్ర విచారణ ఎదుర్కొంటుండగా.. మరొకరు మనీలాండరింగ్ వ్యవహారాలు చక్కదిద్దుకునేందుకు విదేశీటూర్లు చేస్తున్నారట. నంద్యాల […]