జగన్ ఆస్తులపై కన్నేసిన చంద్రబాబు!!

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆస్తుల్ని ‘అటాచ్‌’ చేసిన సందర్భంలో, ఆ ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై అక్రమాస్తుల కేసు నడుస్తోంది. ఈ కేసుకు సంబంధించి పలు ఆస్తుల్ని ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ‘అటాచ్‌’ చేసింది కూడా. ఆ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే న్యాయపరమైన చిక్కులు తలెత్తవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు. ఎలాంటి సమస్యలూ రాకుండా ప్రత్యేక చట్టం ద్వారా […]