కాంగ్రెస్ ఖేల్ ఖతం-ఇది కెసియార్‌ జమానా!!

తెలంగాణలో కాంగ్రెసు పార్టీని ఖతం చెయ్యాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కెసియార్‌ వడివడిగా అడుగులు వేస్తున్నారు. డి.శ్రీనివాస్‌ని టిఆర్‌ఎస్‌లోకి తీసుకొచ్చి, ఆయనకు రాజ్యసభ పదవిని కట్టబెట్టడం వెనుక వ్యూహం ఇదే. అంతకు ముందే కేశవరావుని కూడా కెసియార్‌, టిఆర్‌ఎస్‌లోకి తీసుకురాగలిగారు. కేశవరావు, డిఎస్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఎంతో కీలక నేతలుగా ఉండేవారు. కాంగ్రెసు పార్టీకి చెందిన ముఖ్య నేత వెంకటస్వామిని కూడా తీసుకురావాలనుకున్నారుగానీ, కుదరలేదు. ఆయన కుమారులిప్పుడు టిఆర్‌ఎస్‌లోకి వెళ్ళిపోయారు. అతి త్వరలో ఇంకో కాంగ్రెసు ముఖ్య నేత […]

తెరాస ని డీ కొట్టే సత్తా డీకే అరుణకుందా!!

మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ నుండి కాంగ్రెస్ పార్టీ కి ప్రాతినిద్యం వహిస్తూ కాంగ్రెస్ లో మహా మహా రాజకీయ కురువ్రుద్దులకే కెసిఆర్ ని ఎలా ఎదుర్కోవాలో తెలీక తెరాస కి దాసోహం అవుతుంటే ఒక్క డీకే అరుణ మాత్రం కెసిఆర్ అండ్ తెరాస పార్టీ పై ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అటు అసెంబ్లీ లో ఇటు బయట తెరాస వైఫల్యాల్ని ఎండగడుతూ శభాష్ అనిపించుకుంటోంది.ఇక తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌సింగ్ రాష్ట్ర పర్యటన […]

మళ్లీ తెరాస గూటికి లేడీ బాస్ విజయశాంతి!!

ఒకప్పటి వెండితెర అందాల రాశి,లేడీ బాస్ విజయశాంతి కొన్నాళ్లుగా రాజకీయ స్థాబ్దతతో వున్నారు.తెలంగాణా ఉద్యమంలో తెరాస తో నడిచి మెదక్ MP గా తెరాస తరపున పోటీచేసి గెలుపొంది తెలంగాణా రాష్ట్రం ఏర్పాటయ్యే చివరి రోజుల్లో కాంగ్రెస్ లో చేరి తన రాజకీయ మనుగడనే ప్రశ్నార్థకం చేసుకున్నారు. తెరాస లో వున్నన్ని రోజులు ఒక వెలుగు వెలిగింది విజయశాంతి.పెద్దగా మహిళా ప్రాదాన్యత లేని తెరాస పార్టీ లో విజయశాంతి ఆలోటును తీరుస్తూ ఒకానొక టైం లో No […]

చంద్రబాబు నాన్చుడు-కెసిఆర్ దూకుడు..

తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ దూకుడుగా వెళుతున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడమే కాకుండా, పార్టీ ఫిరాయించిన నేతలకు పదవులు కూడా కట్టబెడుతున్నారు. తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అలాగే మంత్రి అయ్యారు. అయితే చంద్రబాబు మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో ఆశావహుల్ని వెయిటింగ్‌లో పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చంద్రబాబుని కవ్వించడానికి కెసియార్‌ ఇంకోసారి పదవుల పందేరం స్టార్ట్‌ చెయ్యనున్నారని సమాచారమ్‌. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కెసియార్‌ భావిస్తున్నారట. అలాగే మాజీ ఎంపీ వివేక్‌కి ఉప ముఖ్యమంత్రి ఇవ్వనున్నారని గుసగుసలు […]

కెసిఆర్ ఆకర్ష్ మజ్లీస్ ను తాకేనా!!

టీడీపీ ఎమ్మెల్యేలు ఒకరొకరుగా కారెక్కేస్తోంటే, కాంగ్రెస్‌ పార్టీ సంబరపడింది. కాంగ్రెస్‌ ఖాళీ అవుతోంటే టీడీపీ సంబరపడ్తోంది. ఇదంతా చూసి, బీజేపీ తమకేంటి సంబంధం అన్నట్లు వ్యవహరిస్తోంది. మజ్లిస్‌ పార్టీ అయితే అసలు తాము తెలంగాణలోనే వున్నామా.? తెలంగాణ రాజకీయాలతో మమేకమయి వున్నామా? లేదా.? అన్నట్లే వుంటోంది. నిన్న టీడీపీ..ఆ తర్వాత వైెస్సార్సీపీ.. ఇప్పుడు కాంగ్రెస్‌.. రేపు ఇంకో పార్టీ. ఆ ఇంకో పార్టీ బీజేపీ కావొచ్చు, మజ్లిస్‌ పార్టీ కావొచ్చు. ఒక్కసారి ఆపరేషన్‌ ఆకర్ష స్టార్ట్‌ అయ్యిందంటే, […]

జాక్ పాట్ కొట్టనున్న వివేక్..

రాజు తలచు కుంటే దెబ్బలకి కరువా అన్నట్టుంది తెలంగాణా రాజకీయ సిత్రం.కెసిఆర్ కరుణ వుంటే చాలు రాత్రికి రాత్రి ఏ జాక్ పాట్ అయినా తగలోచ్చు.ఒకసారి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వచ్చి చేరి.. తిరిగి కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్లిపోయి.. ఎన్నికలను ఆ పార్టీ నుంచే ఎదుర్కొని తిరిగి ఇప్పుడు టీఆర్ ఎస్ లోకి వచ్చి చేరిన కాకా తనయుడు వివేక్ కు ఇప్పుడు జాక్ పాట్ తగలనుందని టిఆర్ ఎస్ లో టాక్. ప్రస్తుతానికి మాజీ […]

తెలంగాణాలో రాష్ట్రపతి పాలనకు కుట్ర జరుగుతోందా?

కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ లీడర్లు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, దేవరకొండ, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, భాస్కర్‌రావు, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్, కరీంనగర్ జిల్లా కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ జువ్వాడ నర్సింగరావులను సీఎం తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వీరితో పాటూ భారీ సంఖ్యలో కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి […]

కెసియార్‌ వెన్నులో వణుకు పుట్టింది

కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలకే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కెసియార్‌) భయపడలేదు. అంతెందుకు, కోదండరామ్‌ తమ ప్రభుత్వాన్ని కుదిపేసేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ పెద్దగా పట్టించుకోలేదు. కానీ కెసియార్‌ని ఒకటి భయపెట్టింది. అలా ఇలా కాదు, వెన్నులో వణుకుపుట్టేలా చేసింది. అదే పోలియో వైరస్‌. హైద్రాబాద్‌లోని ఓ మురికి కాలువ నీటి శాంపిల్స్‌ని పరీక్షిస్తే అందులో పోలియో వైరస్‌ వెలుగు చూడటంతో కెసియార్‌ షాక్‌కి గురయ్యారు. దేశం నుంచి పోలియో […]

కోదండరాం ని కెలకొద్దు – కెసిఆర్

తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరాంను విమర్శించవద్దని మంత్రులు, పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో విమర్శలు చేస్తే దాన్ని విపక్షాలు అనుకూలంగా మరల్చుకునే అవకాశముందనే ఉద్దేశంతో కేసీఆర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే చాలా నష్టం జరిగిందని గ్రహించిన కెసిఆర్ నష్ట నివారణకి పూనుకున్నాడు. రెండేళ్ళ పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో టి.సర్కార్ తీరుపై కోదండరాం విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆపై కోదండరాంను తప్పబడుతూ మొత్తం […]