తెలంగాణలో `టీడీపీ-టీఆర్ఎస్ దోస్తానా` అంటూ కొన్ని రోజుల క్రితం వచ్చిన వార్తలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టించాయి. తర్వాత ఇది సాధ్యపడేదే కాదంటూ కొందరు దీనిని కొట్టిపాడేశారు. అయితే ఇప్పుడు ఏకంగా ఇరు రాష్ట్రాల సీఎంల మధ్యే ఈ చర్చ రావడంతో ఎప్పుడు పరిస్థితులు ఎలా మారతాయోనని విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే.. ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి సంగతేంటి? అనే సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. కేసీఆర్-రేవంత్ ఒకే ఒరలో ఇమడని రెండు కత్తులన్న విషయం […]
Tag: KCR
టీఆర్ఎస్ మంత్రిలో అసమ్మతి మొదలైందా?
ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో.. ఎవరిని ఎప్పుడు ఎలా చాకచక్యంగా వ్యవహరించాలో తెలంగాణ సీఎం కేసీఆర్కు బాగా తెలుసు! ఉపయోగించుకున్నంత సేపు వారిని తలమీద పెట్టుకుంటారు! తర్వాత వారి వైపు కన్నెత్తి చూడరు! అసలు పట్టించుకోరు! ప్రస్తుతం ఒక మంత్రిని కూడా ఇలా పక్కనపెట్టేశారు. కీలక మంత్రిత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నా.. ఆయన శాఖలోని వ్యవహారాలన్నీ కేసీఆర్ స్వయంగా పరిశీలిస్తుండటంతో మంత్రి ఇబ్బందులు పడుతున్నారట. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న ఆ మంత్రి.. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన డబుల్ బెడ్రూమ్ […]
టీఆర్ఎస్ కీలక నేతల మౌనం.. అసలేం ఏం జరిగింది?
తెల్లారింది మొదలు పొద్దు గూకే వరకు మీడియా మైకుల ముందు మాటల ప్రవాహంతో విపక్షాలను దంచికొట్టే.. టీఆర్ ఎస్ నేతలు ఇప్పుడు ఒక్కసారిగా మౌనం పాటించేస్తున్నారు! ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ కవిత, మంత్రి హరీష్రావు, నాయిని తదితర ప్రధాన పోస్టుల్లో ఉన్న నేతలు సైతం ఇప్పుడు మీడియాకు ముఖం చాటేస్తున్నారు. మరో రెండేళ్లలో కీలకమైన ఎన్నికలు రాబోతున్న తరుణంలో నేతలు ఇలా గప్చుప్ అయిపోవడం.. ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. విషయంలోకి వెళ్తే.. ఇటీవల కాలంలో విపక్షాల […]
ఇద్దరు చంద్రుల షేక్ హ్యాండ్ అందుకేనా?
ఏపీ, తెలంగాణ సీఎంలు కేసీఆర్, చంద్రబాబుల వైఖరే డిఫరెంటు. ఈ ఇద్దరూ అవసరాన్ని బట్టి తిట్టుకోవడం, అవసరాన్ని బట్టి పొగుడుకోవడం పరిపాటైంది. నిన్న మొన్నటి వరకు కృష్ణా వాటర్ విషయంలో ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరించిన ఈ ఇద్దరు ఇప్పుడు ఢిల్లీలో జరిగిన రాష్ట్రపతి నామినేష్ ఘట్టానికి వెళ్లిన సందర్భంలో మాత్రం చిరునవ్వులు చిందుకుని, షేక్ హ్యాండులు ఇచ్చేసుకుని మీడియాకు ఫోజులిచ్చారు. దీంతో ఇప్పుడు వీరిద్దరి చుట్టూతానే పాలిటిక్స్ రింగులు కొడుతున్నాయి. ఎవరికివారే సొంత లాభం లేకుండా […]
అక్కడ మాత్రం వద్దు సార్ టైం వేస్ట్
రెండు రాష్ట్రాల్లో బరిలోకి దిగుతామని ప్రకటించిన జనసేనాని, పవర్ స్టార్ పవన్కల్యాణ్ అందుకు తగినట్టే అడుగులు వేస్తున్నాడు. పార్టీలోకి జనసైనికులను ఆహ్వానించేందుకు పరీక్షలు పెడుతూ.. 2019 ఎన్నికలకు సిద్ధమైపోతున్నాడు. ఈ పరీక్షల్లో పాల్గొనేందుకు ఉత్సాహంగా తరలి వస్తున్నారు యువకులు! ప్రస్తుతం తెలంగాణలోనూ ఈ తరహా శిబిరాలు నిర్వహించాలన్న పవన్ నిర్ణయంతో ఏపీ జనసేన నేతలు కొంత నిరుత్సాహానికి గురవుతున్నారు. తెలంగాణలో కంటే ఏపీలోనే పార్టీకి ఎక్కువ మైలేజ్ వచ్చే అవకాశముందని చెబుతున్నారు. తెలంగాణాలో ఇలాంటి శిబిరాల వల్ల […]
కేసీఆర్కు ఎక్కడో టెన్షన్…అది హరీశేనా..!
తెలంగాణలో అధికార టీఆర్ఎస్లో గత రెండేళ్లుగా వారసత్వ పోరు తీవ్రంగానే జరుగుతోంది. గత ఎన్నికలకు ముందు పార్టీలో హరీశ్రావుకు ఉన్న ప్రాధాన్యం ఎన్నికల తర్వాత క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. కేసీఆర్ సైతం అల్లుడు కంటే కొడుకు కేటీఆర్కే కీలక బాధ్యతలు అప్పగించడంతో రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పిన హరీశ్ ఇప్పుడు సిద్ధిపేట, మెదక్ జిల్లాలకు పరిమితమైపోవాల్సి వచ్చింది. ముఖ్యంగా గ్రేటర్ ఎన్నికల తర్వాత కేటీఆర్ క్రేజ్ మామూలుగా లేదు. ఆ తర్వాత వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు వరంగల్ […]
మియాపూర్ కుంభకోణం: బ్రోకర్గా మారిన దమ్మున్న మీడియా ఎండీ
తెలంగాణ రాజకీయాల్లో మియాపూర్ భూకుంభకోణం కేసు ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. నిన్నటి వరకు అక్కడ టీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్ను పల్లెత్తు మాట అనేందుకు కూడా ప్రతిపక్షాలు సాహసించని పరిస్థితి. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. మియాపూర్ భూకుంభకోణం ఇష్యూలో టీఆర్ఎస్ నాయకుల పేర్లు ఎప్పుడైతే బయటకు వచ్చాయో అది అక్కడ నిద్రాణంగా ఉన్న ప్రతిపక్షాలకు పెద్ద వరంలా మారింది. దీనిని బేస్ చేసుకుని టీఆర్ఎస్తో పాటు సీఎం కేసీఆర్ టార్గెట్గా విరుచుకుపడుతున్నాయి. ఈ ఇష్యూలో టీఆర్ఎస్ […]
సీబీఐ దర్యాప్తుకి `నో` వెనుక రీజన్ ఇదేనా?
ఏదైనా కుంభకోణం బయటపడినా, ఆరోపణలు వచ్చినా వెంటనే `సీబీఐకి కేసు అప్పగించాలని ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా.. ఎంత గందరగోళం సృష్టించినా.. వాటన్నింటినీ ఏమాత్రం ఖాతరు చేయరు తెలంగాణ సీఎం కేసీఆర్. మొన్నటికి మొన్న ఓటుకు నోటు కేసులో, గ్యాంగ్ స్టార్ నయీం కేసులోనూ సరిగ్గా ఇదే జరిగింది. ఇప్పుడు మియాపూర్ భూకుంభకోణం లోనూ కేసీఆర్ దీనినే ఫాలో అవుతున్నారు. కేసును సీబీఐకి అప్పగించకుండా ఆ వివరాలను తన దగ్గరే ఉంచుకోవడం వెనుక వ్యూహం వేరే ఉందని పార్టీలో […]
భూ కుంభకోణంలో డీఎస్.. కేసీఆర్కి మరో తలనొప్పి!
తెలంగాణలో అధికార పార్టీ ఇప్పుడు భూ కుంభకోణాలతో సతమతమవుతోంది. ఆయా కుంభకోణాల్లో కేసీఆర్కు అత్యంత సన్నిహితుల పేర్లు ఉండడం మరింతగా ఆందోళనకు గురి చేస్తోంది. మియాపూర్ భూ కుంభకోణం కేసలో టీఆర్ ఎ స్ సెక్రటరీ జనరల్ కేకే పేరు బాహాటంగానే వినిపించింది. దీంతో ఏకంగా కేసును తానే బదలాయించుకుని పర్యవేక్షిస్తున్నారు కేసీఆర్. ఇక, ఇప్పుడు తాజాగా ప్రభుత్వ సలహాదారు, కేసీఆర్కి అత్యంత ఆప్తుడు సీనియర్ పొలిటీషియన్ అయిన ధర్మపురి శ్రీనివాస్(డీఎస్)పైనే భూ ఆరోపణలు వెల్లువెత్తాయి. రూ.నాలుగు […]