మూడు వరుస హిట్లతో సూపర్ సక్సెస్లో ఉన్న యంగ్టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కేఎస్.రవీంద్ర (బాబి) డైరెక్షన్లో జైలవకుశ సినిమా చేస్తున్నాడు. భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ రోజే రిలీజ్ అయ్యింది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
డైరెక్టర్ బాబి ఈ కథను ఎన్టీఆర్ కోసం రాసుకోలేదట. మాస్ మహారాజ్ రవితేజ్ కోసం ఈ స్క్రిప్ట్ రాసుకున్నాడట. బాబి ఫస్ట్ సినిమా పవర్ రవితేజతోనే తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్టోరీ రవితేజకు నచ్చకపోవడంతో బాబి ఇదే కథను ఎన్టీఆర్కు చెప్పి ఓకే చేయించుకున్నాడు. తాను రిజెక్ట్ చేసిన కథ ఎన్టీఆర్ ఓకే చేయడంతో మాస్ మహరాజ్ షాక్ అయ్యాడన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.