పాలిటిక్స్ లో ఇప్పటికే ఎంతో సినీ నటులు ఎంతోమంది అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వారు ఎంత పెద్ద స్టార్ నటులైనా విమర్శలను, తిట్లను ఎదుర్కోక తప్పదు. తాజాగా అలాంటి అనుభవమే రష్మికాకు ఎదురయింది. ఆమె అభివృద్ధిని ప్రోత్సహించండి అంటూ తాజాగా ఓ ట్విట్ చేయగా క్షణాలో అది వైరల్ అయ్యింది. దీంతో ఈ ట్విట్పై ప్రధాని మోడీ స్పందించాడు. ఆ ఆనందాన్ని ఆస్వాదించే లోగా ఆమెను టార్గెట్ చేస్తూ విమర్శలతో కూడిన మరో ట్విట్ మొదలైంది. దేశంలోనే అత్యంత పొడవైన ముంబై ట్రాన్స్ఫర్ లింక్ ను వాణిజర రాజధాని ముంబైలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ వంతెనకు అటల్ సేతు అని నామకరణం చేశారు.
ఇటీవల దానిపై ప్రయాణించిన హీరోయిన్ రష్మిక మందన ప్రశంసల వర్షం కురిపించింది. కారులో ప్రయాణిస్తూ దాని గురించి తాను మాట్లాడుతున్న వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఆ వీడియో క్షణాల్లో వైరల్ గా మారడంతో ప్రధాని మోడీ దానిపై స్పందించారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడం, వారిని అనుసంధించడం కంటే మించిన సంతృప్తి ఏమంటుంది అంటూ ఆయన స్పందించాడు. కాగా రష్మిక భారత్లో ఇలాంటి ఓ అద్భుతమైన ఆవిష్కరణను ఎన్నడూ ఎవరూ ఊహించి ఉండరు. అలాంటిది కేవలం ఏడేళ్ల వ్యవధిలో సుసాధ్యం చేసి చూపించారు అంటూ రష్మిక ట్విట్ చేసింది. అవంతెనపై ప్రయాణం మధురానుభూతి అంటూ ఆమె రాసుకొచ్చింది.
వికసిత భారత్కు ఈ బ్రిడ్జ్ అర్థం పడుతుంది అంటూ చెప్పుకొచ్చింది. కాగా ఈ వీడియో పై మాజీమంత్రి ఆదిత్య థాక్రే స్పందిస్తూ రష్మిక పేరు ప్రస్తావించకుండానే డైరెక్ట్ అటాక్ చేశాడు. ఒక నటి అకస్మాత్తుగా ప్రస్తుత పాలనపై.. ముఖ్యంగా అటల్ సేతుగా బ్రాండ్ చేయబడిన (MTHL) ఫై ఒక ప్రకటన చేసింది. అది పెయుడో కాదో తెలియదు. దానికి సంబంధించిన వాస్తవాలు ఇవి అంటూ కొన్ని అంశాలను హైలెట్ చేస్తూ ట్విట్ చేశాడు. అలాగే ఆమె చివర్లో మేల్కొని అభివృద్ధికి ఓటేయండి అని చెప్పిందని.. అదే కరెక్ట్ ఎందుకంటే దాని అర్థం బీజేపీకి ఓటు వేయొద్దని చెప్పుకొచ్చాడు ఆధిత్యా థాక్రే. ప్రస్తుతం ఆదిత్య ధాక్రే చేసిన ఈ కామెంట్స్ నెటింట వైరల్గా మారాయి.