టాలీవుడ్లో కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది హీరోయిన్ కృతి సనన్.. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ ఆది పురుష్ సినిమాలో నటించి ఆడియన్స్ ను మరింత ఆకట్టుకుంది. అయితే తాను ఈ స్టేజ్ కు రావడం అంత ఈజీగా జరగలేదని ఎన్నో అవమానాలు ఫేస్ చేశానంటూ తెలియజేయడం జరిగింది.రీసెంట్గా ఉత్తమ నటి జాతీయ అవార్డు సంపాదించుకున్న కృతి సనన్ ఆలియా భట్ తో పాటు అవార్డును పంచుకోవడం జరిగింది.
నటీనటులు లైఫ్ లో ఎన్నో కష్టాలు ఉంటాయని కృతి సనన్ తెలియజేస్తూ ఎదిగే క్రమంలో ఎన్నో ఎదురు దెబ్బలు కూడా తగిలాయని కెరియర్ మొదట్లో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి ఒక మీడియా సంస్థతో మాట్లాడడం జరిగింది ఈ ముద్దుగుమ్మ.. కృతి సనన్ మాట్లాడుతూ.. తాను ముంబైకి వచ్చిన కొత్తలో జరిగిన సంఘటనలు తన జీవితంలో మర్చిపోలేనివి అని.. అప్పట్లో మోడలింగ్ చేస్తూనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తుండే దాన్ని నా అదృష్టం కొద్ది ఒకసారి నేనొక్కడినే ,హీరోపంతీ అనే రెండు సినిమాలలో హీరోయిన్గా అవకాశం వచ్చింది.. దాంతో తన సంతోషానికి హద్దులు లేకుండా పోయాయని తెలిపింది.
అప్పట్లో సినిమాల షూటింగ్ స్టార్ట్ కాలేదు మరి కొద్ది రోజుల్లో స్టార్ట్ అవుతుంది అనుకుంటూ ఉండగా ఒక మోడలింగ్ షోలో పాల్గొని అవకాశం వచ్చింది ర్యాంప్ షోలో పాల్గొనేందుకు వెళ్లాగ స్టేజ్ మీద కాదు పచ్చిక లాగ ఉన్న లాండ్లో క్యాట్ వాక్ చేస్తున్నప్పటికీ నేను వేసుకున్న హై హిల్స్ నేలలోకి దిగిపోయాయి.. దీంతో గందరగోళానికి లోనైన నేను మధ్యలోనే ఆగిపోవడంతో అషో కొరియోగ్రాఫర్ చేసిన ఆవిడ వెంటనే గట్టిగా అరుస్తూ పిచ్చిపిచ్చిగా తిట్టేసింది.. దీంతో ముంబై మోడల్ ముందు తనను దారుణంగా అవమానించింది దీంతో తనకు కన్నీళ్లు ఆగలేదని పక్కకు వెళ్లి చాలాసేపు ఏడ్చాను అంటూ ఎమోషనల్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. మళ్లీ అలాంటి పని చేయలేదని తెలిపింది కృతి సనన్..