మీరు పాలు తాగారా.. అయితే ఈ ఫుడ్ తో దాన్ని బ్యాలెన్స్ చేయొచ్చు..!

ఎముకలు దృఢంగా ఉంటేనే ఏ పని అయినా చేయగలం. ఉదయం లేచిన దగ్గర్నుంచి.. రాత్రి పడుకునే వరకు మనం చేసే పని అంతా ఎముకల మీదనే ఆధారపడి ఉంటుంది. అలాంటి ఎముకలు బలంగా ఉండాలంటే దానికి కావాల్సింది కాల్షియం. కేవలం ఎముకలే కాదు.. కండరాల సంకోచం, దంతాలు, రక్తం గడ్డకట్టడం, నరాల పనితీరు లో క్యాల్షియం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇవే కాకుండా మెదడు ఆరోగ్యంగా ఉండడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా కాల్షియం చాలా బాగా ఉపయోగపడుతుంది.

క్యాల్షియం అధికంగా ఉన్న ఆహార పదార్థాల్లో పాలు ఒకటి. కానీ చాలామందికి పాలు తాగడం ఇష్టం ఉండదు. అలాంటి వారు ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

బాదం:
సుమారు 23 బాదం పప్పుల్లో 75 మిల్లీ గ్రాముల కాలుష్యం నిండి ఉంటుంది. బాదం లో కాపర్, మాంగనీస్, మెగ్నీషియం, ఒమేగా 3,6 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. నానబెట్టిన బాదం, బాదంపాలు తీసుకుంటే క్యాల్షియం పుష్కలంగా అందుతుంది.

ఆకు కూర‌లు:
ఆకు కూరల్లో కూడా కాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఆకుకూరలు తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు దరి చేరవు. ఒక కప్పు ఉడికించిన పాలకూరలో 250 మిల్లీ గ్రాముల క్యాల్షియం, అలాగే ఒక కప్పు ఉడికించిన కాలేలో 180 మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుంది. పాలు తాగని వారు వీటిని తీసుకోవడం వల్ల పాలలో ఉండే పోషకాలు మీకు అందుతాయి.

అంజీర్:
అంజీర్‌లో కూడా క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు అంజీర్ పండ్లలో 162 మిల్లీ గ్రాముల క్యాల్షియం లభిస్తుంది. కేవలం కాలుష్యమే కాకుండా మెగ్నీషియం, ఫైబర్ వంటి గుణాలు కూడా లభిస్తాయి.

చియా సీడ్స్:
ఇందులో కూడా కాలుష్యం అధికంగా ఉంటుంది. రెండు స్పూన్ల చియా సీడ్స్ లో 177 మిల్లీ గ్రాముల కాలుష్యం దొరుకుతుంది. ఇందులో ఒమేగా 3, ప్రోటీన్ కూడా నిండుగా ఉంటాయి.

టోఫూ:
టోఫూ అత్యధికంగా కాల్షియం ఉంటుంది. అరకప్పు టోఫూ లో ఏకంగా 861 మిల్లీ గ్రాముల క్యాల్షియం లభిస్తుంది. దీనిని కూరల్లో, జ్యూస్ లో, సలాడ్స్ లో ఎలా అయినా తీసుకోవచ్చు.