గ్యాప్ వచ్చినా ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న అనుష్క.!

ప్రముఖ టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి సూపర్ సినిమాతో అడుగుపెట్టి అనతి కాలంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ అరుంధతి వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక కమర్షియల్ సినిమాలలో కూడా హీరోతో పాటు సమాన ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటించిన ఈమె బాహుబలి సినిమాలో దేవసేనగా తన నటనతో హుందాతనంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఈ సినిమా రూ .67 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసి అనుష్క స్టామినాను మరొకసారి నిరూపించింది. అయితే ఈ సినిమా తర్వాత అనుష్క వేగం తగ్గించారనే చెప్పాలి. సైరా నరసింహారెడ్డిలో ఝాన్సీ రాణి లక్ష్మీబాయిగా ప్రత్యేక పాత్రలో నటించిన ఈమె ఆ తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించలేదు. కోవిడ్ సమయంలో నిశ్శబ్దం అనే థ్రిల్లర్ మూవీతో ఓటీటి ద్వారా ప్రేక్షకులను పలకరించిన ఈమె ఈ సినిమా వచ్చి ఇప్పటికే మూడేళ్లు పూర్తి కావస్తున్నా .. ఇప్పటివరకు మళ్ళీ వెండితెరపై కనిపించలేదు.

మొత్తానికి ఇన్నాళ్లకు మళ్ళీ వెండితెరపై కనిపించడానికి సిద్ధమవుతోంది అనుష్క శెట్టి. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో సెప్టెంబర్ 7వ తేదీన థియేటర్లలో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. ఇందులో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కి జోడిగా అనుష్క నటిస్తున్నారు. ఇకపోతే అనుష్కకు గ్యాప్ వచ్చిన ఆమె రెమ్యునరేషన్ మాత్రం ఏమి తగ్గలేదని చెప్పాలి. ఇక ఆమె మంచి ఫామ్ లో ఉన్నప్పుడు సినిమాకు రూ .5 కోట్ల వరకు పారితోషకం తీసుకున్న ఈమె.. ఈ సినిమా కోసం ఏకంగా 6 కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇకపోతే దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడునున్నట్లు తెలుస్తోంది.